జనసేన పొత్తుపై కిషన్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు? క్లారిటీ ఇదే!

ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చేశారంటూ చెబుతున్న షాకింగ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

Update: 2023-12-11 04:52 GMT
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చేశారంటూ చెబుతున్న షాకింగ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేనతో పొత్తు పెట్టుకోవటం.. అందులో భాగంగా మొత్తం 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీచేశారు. ఈ పోటీలో అందరూ డిపాజిట్లు కోల్పోయారు. అంతో ఇంతో ఓట్లు సాధన అన్నది ఒక్క కూకట్ పల్లి నియోజకవర్గంలోనే జరిగింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపెట్టుకోవటంపై కిషన్ రెడ్డి అసహనంతో ఉన్నట్లుగా పేర్కొంటూ కొన్ని షాకింగ్ కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

అయితే.. ఈ వ్యాఖ్యలన్ని కల్పితం. మొత్తం ఫేక్ సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం కిషన్ రెడ్డి వరకు వెళ్లింది. వెంటనే.. ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పోస్టు పెట్టారు. జరుగుతున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేసిన అంశం రెండు పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు.

ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందుకే తాము జనసేనతో కలిసి బరిలోకి దిగినట్లుగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే.. ఈ అంశంపై తాను అనుచితంగా వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొంటూ వస్తున్న సమాచారంలో నిజం లేదని.. అదంతా తప్పుడు ప్రచారంగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఇలాంటి అసత్యాల్ని వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వనున్నట్లుగా స్పష్టం చేశారు.మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News