పవన్ క్యాంప్ ఆఫీస్ ముందు నేమ్ బోర్డ్ వైరల్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే

Update: 2024-06-19 06:20 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. విజయవాడ నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లో ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంది. ఈ క్రమంలో అక్కడ కనిపించిన ఒక దృశ్యం.. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే పవన్ కల్యాణ్ నేమ్ బోర్డ్!

అవును... విజయవాడలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లో పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన ఆయన.. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభుషణ్ రావు, కమిషనర్ కన్నబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత అధికారులతో కలిసి ఆయన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించిన మార్పులు సూచించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈరోజు నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లో ఆయన క్యాంప్ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బోర్డుపై "శ్రీ కొణిదల పవన్ కల్యాణ్.. గౌ. ఉపముఖ్యమంత్రి, పంజాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికశాఖ మంత్రివర్యులు అని రాసి ఉంది.

ప్రస్తుతం ఈ బోర్డు ఫోటోలో నెట్టింట వైరల్ గా మారాయి. జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ వీటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడు, నటుడు ఈ హోదాకు చేరుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News