చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ !

‘చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న తెదేపా అధినేత చంద్రబాబుకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు

Update: 2024-06-04 12:39 GMT

‘చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న తెదేపా అధినేత చంద్రబాబుకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం.. మీ మీద ప్రజలకున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ గారి మీద ప్రజలు కనబరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.. !’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పోస్ట్ ఎక్స్ వేదికగా వైరల్ అవుతున్నది.

ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ‘డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను‘ అని మరొక పోస్ట్ పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య ఫలితాలు వెళ్లడవుతున్నాయి. జనసేన పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలలో విజయం దిశగా సాగుతుండగా, తెలుగుదేశం పార్టీ 136, బీజేపీ ఎనిమిది స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పది స్థానాలకు పరిమితం అవుతుండడం విశేషం.

Tags:    

Similar News