అమరావతి రైతులకు పోసాని మార్క్ హెచ్చరిక... తెరపైకి పవన్ మిస్టరీ!

Update: 2023-08-04 15:02 GMT

ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి.. మరోసారి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఫైరయ్యారు. ఘాటు పదాలతో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అమరావతి రైతులకు తనదైన శైలిలో హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా పోసాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అవును... చంద్రబాబును పవన్ నమ్ముతున్నారని, అది కరెక్ట్ కాదని గతకొంతకాలంగా పవన్ కు సూచిస్తున్న పోసాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులను కుట్రలు, కుతంత్రాలతో ఓడించిన చంద్రబాబు వైపు పవన్ కల్యాణ్ ఎందుకు మొగ్గు చూపుతున్నారని కీలక ప్రశ్నలు సంధించారు!

"మా అన్నయ్య ఓడినా పర్వాలేదు, కాపులు ఓడినా పర్వాలేదు, మా కమ్మోడు గెలవాలి, చంద్రబాబు గెలవాలి అంటున్నావు. ఇదేం మిస్టరీనో నాకు అర్థం కావడం లేదు. పవన్ లాంటి నాయకుడు దొరకడం కాపుల ఖర్మ. పదవి వద్దంటావ్.. అధికారం వద్దంటావ్.. చంద్రబాబును సీఎంను చేయమంటావ్. ఇదేం మిస్టరీ పవన్.. నాకు అర్థం కావడం లేదు." అంటూ పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు.

"చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అవినీతి అని నువ్వే చెప్పావ్.. మరి ఎందుకు మళ్లీ చంద్రబాబు దగ్గరకెళ్లావ్? లోకేష్ తెగ తింటున్నాడు.. అవినీతి చేస్తున్నాడని అన్నావ్.. పైనున్న ఎన్టీఆర్ ఏడుస్తుంటాడని అన్నావ్.. మళ్లీ లోకేష్ దగ్గరకు చేరావు? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్లకు ఓట్లు వేయరని అన్నావు.. మరి ఎందుకు ఆయన వెంట పడుతున్నావు? ఈ మిస్టరీ ఏంటో నాకు అర్థంకావడం లేదు." ఇలా సాగింది పోసాని ప్రశ్నల పరంపర!

ఇదే సమయంలో అమరావతిలో పేదలకు ఇళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోన్నారంటూ పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కమ్మ సామాజిక వర్గంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. చంద్రబాబు మాటలు వింటే సర్వనాశనం తప్పదని అమరావతి రైతులను పోసాని హెచ్చరించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వంటి దొంగలను చంద్రబాబు అమరావతికి తీసుకొచ్చి డ్రామాలు ఆడారని ఆరోపించారు.

ఇదే క్రమంలో ఆర్-5 జోన్‌ లో పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడం ద్వారా పేదల ఉసురు తగిలి కుళ్లికుళ్లి ఛస్తారని పోసాని శాపనార్ధాలు పెట్టారు. రైతులను జగన్‌ పైకి ఎగదోసి, బూతులు తిట్టిస్తోన్నాడని పోసాని ఆరోపించారు. రాజకీయ నాయకుడిగా కాదు కదా కనీసం ఓ మనిషిగా కూడా ప్రజలకు సేవ చేసే విషయంలో జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరితూగడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి!


Full View


Tags:    

Similar News