రోహిత్ మతిమరుపు పీక్స్.. ఈసారి పాస్ పోర్టు మర్చిపోయాడు

బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి వస్తే బౌలర్లకు చుక్కలు చూపించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విచిత్రమైన అలవాటు ఉంది

Update: 2023-09-19 04:43 GMT

బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి వస్తే బౌలర్లకు చుక్కలు చూపించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విచిత్రమైన అలవాటు ఉంది. కొన్ని విషయాల్ని అతగాడు ఇట్టే మర్చిపోతుంటాడు. తన వస్తువుల విషయంలో అతడెంత మతిమరుపుతో ఉంటాడన్న దానిపై విరాట్ కోహ్లీ చెప్పటం తెలిసిందే. తాజాగా.. చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే.. రోహిత్ భయ్యా మరీ ఇంత మతిమరపా?అని అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే.. ఈసారి రోహిత్ మర్చిపోయింది.. మరేదో కాదు.. ఏకంగా పాస్ పోర్టునే.

తాము బస చేసిన హోటల్లో తన పాస్ పోర్టును వదిలేసి ఎయిర్ పోర్టుకు బయలుదేరిన కెప్టెన్.. టీమ్ సభ్యులతో కలిసి బస్సు ఎక్కిన వెంటనే.. తన పాస్ పోర్టు గుర్తుకు వచ్చి.. హోటల్ సిబ్బందిని తన పాస్ పోర్టుతెచ్చి ఇవ్వాల్సిందిగా కోరారు. వారు పాస్ పోర్టు తెచ్చి ఇచ్చే వరకు బస్సు డోర్ వద్దే వెయిట్ చేశారు. ఈ సందర్భంగా టీం సభ్యులు రోహిత్ ను ఆట పట్టించారు.

హోటల్ సభ్యుల నుంచి పాస్ పోర్టును అందుకున్న రోహిత్.. తన సీటు వద్దకు కూర్చునే క్రమంలో.. టీం సభ్యులంతా అతడ్ని టీజ్ చేస్తూ అరవటం.. కేకలు వేయటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ ను ఫేస్ చేయనున్న టీమిండియా.. సోమవారం ఉదయం ముంబయికి చేరుకోవటం తెలిసిందే.

Tags:    

Similar News