లడ్డూ వేలంలో హుషారు.. ఆ వెంటనే షాకింగ్ విషాదం

హైదరాబాద్ లోని మణికొండలో చోటు చేసుకున్న ఒక మరణం.. అందరిని ముచ్చెమటలు పోసేలా మారింది.

Update: 2024-09-16 10:42 GMT

హైదరాబాద్ లోని మణికొండలో చోటు చేసుకున్న ఒక మరణం.. అందరిని ముచ్చెమటలు పోసేలా మారింది. ఊహించేందుకు సైతం కష్టంగా ఉన్న ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా నోటి వెంట మాట రానట్లు ఉండిపోతున్న పరిస్థితి. అప్పటివరకు ఎంతో హుషారుగా లడ్డూ వేలంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగి.. అంతలోనే గుండెపోటుకు గురి కావటం.. ప్రాణాలు విడిచిన వైనంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

మణికొండ అల్కాపురి కాలనీలో చోటు చేసుకున్న ఈ విషాదం షాకింగ్ గా మారింది. అల్కాపురి టౌన్ షిప్ గణేశ్ ఉత్సవ కమిటీ లడ్డు వేలంలో ఐటీ ఉద్యోగి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. వేలంలో పోటాపోటీగా హుషారుగా ముందుకు వెళ్లారు. రూ.15 లక్షల వరకు వేలంలో వచ్చినప్పటికి.. అతడి స్నేహితుడు మరింత ముందుకు వెళ్లాడు. దీంతో.. ఆయన వేలంలో తగ్గారు. చివరకు అతడి స్నేహితుడు వేలంలో లడ్డూను సొంతం చేసుకున్నారు.

అనంతరం గణనాథుడి మండపం వద్ద పెద్ద ఎత్తున తీన్ మార్ స్టెప్పులతో డ్యాన్సులు వేశారు. అలా చేసిన కొంతకాలం తర్వాత ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. వెంటనే.. ఆందోళన చెందిన అతడి కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పారు. గుండెపోటుతో శ్యామ్ ప్రసాద్ మరణించినట్లుగా వైద్యులు వెల్లడించటంతో కాలనీ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా తమ వద్దే ఉన్న వ్యక్తి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటం వారికి ఏ మాత్రం మింగుడుపడటం లేదు. కాలనీ మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Tags:    

Similar News