బ్యాంకాక్‌ హోటల్‌ లో మిస్టరీ మరణాలు!.. అసలేం జరిగింది?

అయితే తాజాగా బ్యాంకాక్ హోటల్ లో ఆరుగురు విదేశీయులు అనుమాదాస్పద స్థితిలో మృతి చెందిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

Update: 2024-07-17 09:09 GMT

సాధారణంగా బ్యాంకాక్ అంటే ఎంటర్టైన్ మెంట్ యాంగిల్లోనూ, టూరిజం కోణంలోనూ చాలా మంది చూస్తారు! ఆ ప్రాంతానికి సంబంధించిన వార్తలు, కథనాలు మీడియాలో ప్రత్యక్షమైనా ఆ కోణంలోనే ఉంటాయి. అయితే తాజాగా బ్యాంకాక్ హోటల్ లో ఆరుగురు విదేశీయులు అనుమాదాస్పద స్థితిలో మృతి చెందిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తాదనే పేరున్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఆరుగురు విదేశీయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ మేరకు ఆరుగురు విదేశీయులు మంగళవారం సిటీలోని గ్రాండ్ హయత్ హోటల్ గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు!

అయితే ఈ హోటల్ లో కానీ, పరిశర ప్రాంతాల్లో కానీ తుపాకీ చప్పుడు ఏమీ రాకపోవడం, మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలూ లేకపోవడంతో... బాధితులు విషం తాగి చనిపోయారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని తెలుస్తుంది. మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉండగా... వారంతా వియత్నా వాసులేనని అంటున్నారు.

అయితే వీరిలో కొందరికి అటు వియత్నా, ఇటు అమెరికా.. రెండు దేశాల పౌరసత్వం ఉందని థాయిలాండ్ ప్రధాని తెలిపారు. వాస్తవానికి... హోటల్ లో బస చేసేందుకు ఏడుగురు బుక్ చేసుకోగా.. కేవలం ఐదుగురు మాత్రమే చెక్-ఇన్ చేయగా.. వారిలో ఓ వ్యక్తి ఆచూకీ తెలియడం లేదని.. మృతుల్లో ఒకరు హోటల్ రికార్డులతో సరిపోలలేదని పోలీసులు తెలిపారు!

ఈ సమయంలో ఈ ఘటన పర్యాటక రంగంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకు దీనిపై వేగవంతమైన దర్యాప్తు జరపాలని ప్రధాని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News