లా చదివిన ఈ భార్యభర్తల అరాచకం తెలిస్తే నోట మాట రాదంతే

ఈ ఉదంతం గురించి విన్నవారు ఎవరికైనా నోట మాట రాదంతే.

Update: 2024-07-27 07:04 GMT

ఉన్నత చదువులు చదివి.. డబ్బు మీద పేరాశతో నీతి తప్పుతున్నోళ్ల సంఖ్య ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో చోటు చేసుకుంటున్న దారుణాల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. విన్నంతనే ఉలిక్కిపడేలా మారిన ఈ ఉదంతం తిరుపతి పట్టణంలో సంచలనంగా మారింది. ఈ ఉదంతం గురించి విన్నవారు ఎవరికైనా నోట మాట రాదంతే. న్యాయవిద్య చదువుకొని గంజాయికి బానిసలైన తిరుపతి జంట.. వారి దుశ్చర్యలు చూశాక.. కొత్త వారితో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే..

తిరుపతి గ్రామీణ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలానికి చెందిన 22 ఏళ్ల యువతి నాలుగేళ్ల క్రితం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఎల్ఎల్ బీ కోర్సులో చేరారు. కొంతకాలం కాలేజీ హాస్టల్ లో ఉన్నారు. ఆ టైంలో తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన మరో లా స్టూడెంట్ ప్రణవతో పరిచయమైంది. దీంతో.. ఆమె ఇంటికి వెళ్లి వచ్చేది. ఆ టైంలోనే ప్రణవ భర్త క్రిష్ణకిషోర్ తో పరిచయమైంది. అతను కూడా ఎస్వీయూ లా కాలేజీలో ఎల్ఎల్ బీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

ఈ దంపతులు గంజాయికి బానిసలయ్యారు. స్నేహంలో భాగంగా ఇంటికి అప్పుడప్పుడు వచ్చే యువతికి గంజాయి అలవాటు చేశారు. ఈ క్రమంలో గంజాయి మైకంలో ఉన్న యువతిని క్రిష్ణ కిషోర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు. దానంతా అతని భార్య షూట్ చేసింది. ఆ తరవాత ఆ వీడియోను చూపించి బెదిరించి ఆమె నగల్ని తీసుకున్నారు. ఈ మధ్యనే బాదిత యువతికి పెళ్లి కుదిరింది. తాము చెప్పినట్లు డబ్బులు ఇవ్వట్లేదన్న కోపంతో తమ వద్ద ఉన్న ఫోటోలు.. వీడియోలను కాబోయే భర్తకు.. యువతి సోదరుడికి పంపి డబ్బులు డిమాండ్ చేశారు.

దీంతో షాక్ తిన్న యువతి కుటుంబ సభ్యులు తిరుపతి గ్రామీణ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు.. లా కోర్సు చేస్తున్న దంపతుల్ని అరెస్టు చేశారు. వారి ఘన కార్యాల్ని వారు కోర్సు చేస్తున్న విశ్వవిద్యాలయాలకు సమాచారం ఇవ్వటంతో.. ఈ దుర్మార్గ దంపతులను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు. కొత్త వారిలో స్నేహం.. వారు చేసే అలవాట్ల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News