పిక్ ఆఫ్ ది డే : సింగిల్ ఫ్రేమ్‌ లో ముగ్గురు స్టార్స్‌

ఇది ఒక పాన్ ఇండియా మూవీ

Update: 2023-07-20 11:09 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే గ్లిమ్స్ ను అంతర్జాతీయ వేదిక శాన్ డీగో లో విడుదల చేయబోతున్నారు. అందుకోసం హీరో ప్రభాస్ తో పాటు రానా ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న యూనివర్శిల్‌ స్టార్ కమల్ హాసన్‌ కూడా చేరుకోవడం జరిగింది.


ఈ ముగ్గురు ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో విడివిడిగా వైరల్ అయ్యాయి. కానీ ముగ్గురు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ప్రాజెక్ట్‌ కే లో ప్రభాస్‌.. కమల్ హాసన్‌ లు సింగిల్ ఫ్రేమ్‌ లో కనిపిస్తారో లేదో కానీ.. ఇప్పుడు ఇలా కనిపించడం కన్నుల విందు అన్నట్లుగా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

రానా 'ప్రాజెక్ట్‌ కే' సినిమాలో నటిస్తున్నది లేనిది క్లారిటీ లేదు. కానీ ఇదే వేడుక వేదిక పై తన హిరణ్యకశ్యప సినిమా ను ప్రకటించేందుకు చేరుకున్నాడు. దాంతో పాటు ప్రభాస్ తో ఉన్న సాన్నిహిత్యం.. స్నేహం కారణంగా ప్రాజెక్ట్‌ కే సినిమా ప్రమోషన్ లో తాను భాగస్వామిగా నిలుస్తున్నాడు. మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్‌ కే సందడి ఓ రేంజ్ లో ఉంది.

ఇదే సమయంలో ఈ ముగ్గురు ఇలా సింగిల్ ఫ్రేమల్‌ లో కనిపించడంతో ప్రాజెక్ట్‌ కే పై పాన్‌ ఇండియా స్థాయిలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమాకు మహానటి ఫేం నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ హాట్ బ్యూటీ దీపికా పదుకునే.. దిశా పటానీ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో వైజయంతి మూవీస్ లో అశ్వినీదత్ ఈ సినిమాను దాదాపు రూ.500 కోట్ల తో నిర్మిస్తున్నాడు. సింగీతం శ్రీనివాస్ ఈ సినిమా కు మెంటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇది ఒక పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా కాకుండా పాన్ వరల్డ్‌ మూవీ అన్నట్లుగా ఉండబోతుందని ఫస్ట్‌ లుక్ విడుదల తర్వాత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News