తీహార్ జైల్లో వసతుల కోసం కోటి లంచం?

Update: 2021-12-18 14:31 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. రూ. 200 కోట్లు మోసం చేశాడు. ప్రస్తుతం ఆర్థిక నేరాలు చేసినందుకు గాను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. అయితే అన్ని వందల కోట్లు మోసం చేసిన మనిషి తనకు జైల్లో వసతుల కోసం.. స్వేచ్ఛగా ఉండేందుకు గాను జైలు సిబ్బందినే కొనేశాడా? ఏకంగా నెలకు రూ.కోటి లంచం జైలు సిబ్బందికి ఇచ్చాడా? అంటే ఔననే అంటోంది ఈడీ. ఈ మేరకు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి..

ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.200 కోట్ల మోసం కేసులో అరెస్ట్ అయిన సుఖేష్.. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ తనకు ఖరీదైన వసతులు కల్పించడంతోపాటు స్వేచ్ఛగా ఉండేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుఖేశ్.. ప్రతినెల రూ.కోటి లంచం ఇస్తున్నాడని తాజాగా ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేశ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జైలుకు వెళ్లినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు సరికదా.. అక్కడి నుంచే నేరాలకు పాల్పడినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం జైలు సిబ్బందికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్లు సమాచారం. జైల్లో మొబైల్ ఫోన్ వినియోగించేందుకే 15 రోజులకు రూ.60-70 లక్షలు ఇచ్చినట్లు సదురు కథనాలు తెలిపాయి.

జైల్లో మొబైల్ ఫోన్ వినియోగించేందుకు రూ.60-75 లక్షలు ఇచ్చినట్టు సదురు కథనాల ద్వారా తెలిసింది. జైలు గదిలో లగ్జరీ సదుపాయాలతోపాటు స్వేచ్ఛగా ఉండేందుకు ప్రతినెల రూ.కోటి వరకూ ఇచ్చినట్టు తెలిసింది.

ఇక జైల్లో ఉన్న సుఖేశ్ ను జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహీతో పాటు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు, మోడల్స్ వచ్చేవారని సదురు కథనాలు పేర్కొన్నాయి. మొత్తం 12మంది హీరోయిన్లు, మోడల్స్ జైల్లో అతడిని కలిసినట్లు సమాచారం. అంతేగాక జైల్లో సిబ్బందికి సుఖేశ్.. చికెన్ పార్టీలు కూడా ఇచ్చేవాడని ఆ కథనాల ద్వారా తెలిసింది.

ఇక సుఖేష్ మాత్రం తీహార్ జైలు సిబ్బంది తనను వేధింపులకు గురిచేస్తున్నారని అధికారులకు లేఖ రాయడం గమనార్హం. తనను డబుల్ లాక్ గదిలో బధించారని.. మానసికంగా కృంగిపోయానని.. తన భార్యను కేవలం రెండు వారాలకొకసారి మాత్రమే కలవనిస్తున్నారని ఆరోపించాడు.
Tags:    

Similar News