బ్రేకింగ్: తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం..శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ‌ మునక

Update: 2020-08-20 17:06 GMT
తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలతో ఉవ్వెత్తున వరద వస్తున్న వేళ ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.

ఏజెన్సీలోని చింతూరులో శబరి నది బ్రిడ్జిని ఢీకొట్టిన ఓ లాంచీ అనంతరం నదిలో మునిగిపోయిందని సమాచారం. లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం.

చిమ్మి చీకటి కావడంతో లాంచీలో ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుంటున్నాయి.

కల్లేరు పంచాయితీకి సరుకులు అందించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. శబరి నది బ్రిడ్జి పిల్లర్ ను గుద్దుకొని లాంచీ రెండు ముక్కులైందని సమాచారం. లాంచీలో ముంపు బాధితులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు తెలిసింది. ఎంతమంది గల్లంతైందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    

Similar News