సెలబ్రిటిలు, వాళ్ల పిల్లలపై సోషల్మీడియాలో తప్పుడు వార్తలు ట్రోల్ చేయడం ఈ మధ్య కామన్ అయిపోయింది. కొంతమంది ఆ వార్తలను లైట్ తీసుకుంటుంటే .. మరికొంతమంది వాటికి స్ట్రాంగ్గా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే నెటిజన్లు కూడా నిజానిజాలను తెలుసుకోకుండా తప్పుడు వార్తలనే ఎక్కువగా నమ్ముతున్నారు. తాజాగా జరిగిన ఉదంతమే అందుకు ఉదాహరణ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలీ భార్య ఇటీవల ఐఏఎస్ పరీక్ష పాసయ్యారు. అయితే ఆమె కష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐఏఎస్ సాధించారు. కానీ కొందరు ఆకతాయిలు మాత్రం ఆమె ఐఏఎస్ పరీక్ష రాయలేదని.. కేవలం తండ్రి అండదండలతో ఐఏఎస్ సాధించారంటూ సోషల్మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్చేశారు. ఈ సమాచారం విపరీతంగా ట్రోల్ అయ్యింది.
దీంతో అంజలీ బిర్లా నేరుగా రంగంలోకి దిగి తనపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని ఆధారాలతో సహా నిరూపించారు. ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ) సంస్థ ఇది తప్పుడు వార్త అని తేల్చిచెప్పింది కూడా. అయినప్పటికీ ట్రోలింగ్ ఆగలేదు. దీంతో అంజలి బిర్లా నేరుగా రంగంలోకి దిగారు. తాను ఎక్కడెక్కడ పరీక్షలు రాసింది. ఎన్నిమార్కులు వచ్చింది. ఇలా పూర్తివివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా అంజలి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఎంత నిజాయితీగా ఉంటానో నా సన్నిహితులకు తెలుసు. కానీ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేశారు. ట్రోలింగ్ చేసిన వాళ్లను ఇప్పుడు పట్టుకోగలిగాం. కానీ ట్రోలింగ్కు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురావాలన్నది నా అభిప్రాయం. ఇవాళ నేను బాధితురాలిని అయ్యాను. రేపు మరొకరు కావచ్చు.
నా ట్రోలింగ్ నాకు మంచే చేసింది. భవిష్యత్లో నాకు ఇటువంటి ఘటనలు అనేకం ఎదురుకావచ్చు. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఈ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను కష్టపడి చదివి సాధించుకున్న ఉద్యోగంపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది’. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్కు పాల్పడిన వారికి ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వ్యక్తులపై కాకపోయినా.. కనీసం వ్యవస్థలపైనైనా గౌరవం ఉంచాలంటూ ఆమె హితవు పలికారు.
దీంతో అంజలీ బిర్లా నేరుగా రంగంలోకి దిగి తనపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని ఆధారాలతో సహా నిరూపించారు. ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ) సంస్థ ఇది తప్పుడు వార్త అని తేల్చిచెప్పింది కూడా. అయినప్పటికీ ట్రోలింగ్ ఆగలేదు. దీంతో అంజలి బిర్లా నేరుగా రంగంలోకి దిగారు. తాను ఎక్కడెక్కడ పరీక్షలు రాసింది. ఎన్నిమార్కులు వచ్చింది. ఇలా పూర్తివివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా అంజలి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఎంత నిజాయితీగా ఉంటానో నా సన్నిహితులకు తెలుసు. కానీ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేశారు. ట్రోలింగ్ చేసిన వాళ్లను ఇప్పుడు పట్టుకోగలిగాం. కానీ ట్రోలింగ్కు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురావాలన్నది నా అభిప్రాయం. ఇవాళ నేను బాధితురాలిని అయ్యాను. రేపు మరొకరు కావచ్చు.
నా ట్రోలింగ్ నాకు మంచే చేసింది. భవిష్యత్లో నాకు ఇటువంటి ఘటనలు అనేకం ఎదురుకావచ్చు. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఈ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను కష్టపడి చదివి సాధించుకున్న ఉద్యోగంపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది’. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్కు పాల్పడిన వారికి ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వ్యక్తులపై కాకపోయినా.. కనీసం వ్యవస్థలపైనైనా గౌరవం ఉంచాలంటూ ఆమె హితవు పలికారు.