బెదిరించి.. విషంపెట్టి చంపాలని చూశారు.. బాబు మోహన్ సంచలన కామెంట్స్

Update: 2022-07-09 23:30 GMT
బాబు మోహన్.. టాలీవుడ్ లో ఒకప్పుడు బిజీ కమెడియన్ గా ఉండేవారు. వరుస అవకాశాలతో అందరి సినిమాల్లో నటించేవారు. కోటా శ్రీనివాసరావుతో  బాబు మోహన్ చేసిన కామెడీ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. బాబు మోహన్ చేసిన పాత్రలు ఇప్పటికీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో కూడా ఆయన నటిస్తూ పేరు తెచ్చుకున్నారు.

అయితే సడెన్ గా కమెడియన్ గా స్టార్ గా ఉన్న సమయంలోనే బాబు మోహన్ రాజకీయాల్లోకి వచ్చారు. కొన్ని సమయాల్లో ఆయన ఆపాయాలు కూడా ఎదుర్కొన్నాడని తాజాగా తెలిసింది. కొన్ని సమయాల్లో  బాబు మోహన్ ఎన్నో కుట్రలకు బలయ్యారని చెప్పుకొచ్చారు. విషం పెట్టి చంపాలని కూడా చూసినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు.

మొదట తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టిన ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా మరొకసారి మంత్రిగా కూడా కొనసాగారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో మంత్రి అయ్యారు. కేసీఆర్ తో విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం బీజేపీలో చేరి కొనసాగుతున్నారు.

తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని చేదు అనుభవాల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ‘సినిమాలు చేసే సమయంలో నాకు, భరణికి పాన్ తినే అలవాటు ఉండేదని.. ఆ తర్వాత అది ఒక వ్యసనంలా మారిపోయిందని..రోజుకు కొన్ని సార్లు 30కి పైగా పాన్లు తినేవాడిని’ అని బాబు మోహన్ తెలిపాడు. షూటింగ్ కు వెళ్లేటప్పుడు అలాగే ఎక్కడికైనా వెళ్లినా కూడా డబ్బా నిండా పాన్ లు కూడా తీసుకెళ్లేవాడిని’ అని బాబు మోహన్ తెలిపారు.

హైదరాబాద్ కు వచ్చేటప్పుడు సంగారెడ్డి మీదుగా వచ్చేవాడినని.. దారి మధ్యలో నాకు తెలిసిన ఒక పాన్ షాప్ లో పాన్ కట్టించుకొని వెళ్లానని తెలిపారు. కారులో కొద్దిదూరం వెళ్లగానే నాకు ఫోన్ వచ్చిందని.. ఆ డబ్బాలో పాన్ తినవద్దని.. అందులో విషం కలిపారని.. పాన్ కట్టిన వ్యక్తి భార్య నాకు ఫోన్ చేసి చెప్పిందని షాకింగ్ విషయాన్ని చెప్పిందన్నారు.కొందరు బెదిరించిన కారణంగానే అలా చేసినట్లుగా ఆమె నాతో చెప్పుకొని ఏడ్చిందని బాబు మోహన్ తెలిపారు.

రాజకీయాల్లో ఉంటే ఇంత దారుణంగా ఉంటాయా? అని అప్పుడే అర్థమైందని బాబు మోహన్ వివరించారు. ఆ విష ప్రయత్నం తర్వాత నుంచి జాగ్రత్తగా ఉంటున్నట్టు బాబు మోహన్ వివరించారు.
Tags:    

Similar News