బెంగళూరు ‘మత్తు’ పార్టీల్లో గుట్టు రట్టు.. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ ఇలానట!

Update: 2021-04-14 03:53 GMT
బెంగళూరులోని ఒక ప్రముఖ హోటల్లో నిర్వహించే డ్రగ్స్ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సినీ.. రాజకీయ రంగాలకు చెందిన పలువురు ఈ పార్టీలకు తరచూ హాజరయ్యే వారని తేలటం.. ఇందులో తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు.. వ్యాపారులు సైతం హాజరయ్యారన్న బయటకు రావటం సంచలనంగా మారిన వైనం తెలిసిందే. ఈ పార్టీల మీద విచారణ జరుపుతున్న బెంగళూరు పోలీసులు.. కొత్త విషయాల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది.

వారాంతంలో జరిగే ఈ తరహా పార్టీలకు తెలంగాణకు నుంచి పలువురు.. బెంగళూరుకు పరుగులు పెట్టటానికి కారణం ఏమిటి? ఆ పార్టీలకు అంత క్రేజ్ ఎందుకు? ఆ పార్టీల ప్రత్యేకత ఏమిటి? అన్న వివరాల మీద ఫోకస్ చేసిన వారికి కొత్త విషయాలు బయటకువస్తున్నాయి. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. బెంగళూరులోని డాలర్స్ కాలనీతో పాటు.. ఒక ప్రముఖ హోటల్లోనూ వీకెండ్ లలో ఈ ప్రత్యేక పార్టీలు జరిగేవి.

ఈ పార్టీలకు హాజరయ్యే వారికి కోరుకునే సకల సదుపాయాలు ఈ పార్టీలో లభించటం ఒక ప్రత్యేకతగా చెబుతున్నారు. పార్టీకి హాజరయ్యే వారు కేవలం రూ.3500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇంత పెద్ద పార్టీకి ఎంట్రీ ఫీజు తక్కువగా అనిపించొచ్చు. కానీ.. లోపలకు అడుగు పెట్టిన తర్వాత నుంచి అక్కడ పొందే ప్రతి సేవకు దేనికదే.. సప‘రేట్’ గా చెల్లించాల్సి ఉంటుందట.

తినే తిండికి.. తాగేదానికి.. కొందరు కోరుకున్న మత్తు మందులకు వేర్వేరుగా చెల్లింపులు జరపాల్సి ఉంటుందని.. ఇతర ప్రాంతాల నుంచి హాజరయ్య వారికి ప్రధాన ఆకర్షణగా.. విదేశీ యువతులు కూడా ఉండేవారిని చెబుతున్నారు.  శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత మొదలయ్యే ఈ పార్టీ ఆదివారం ఉదయం వరకు సాగేవని చెబుతున్నారు. పార్టీలోకి ఎంట్రీ ఇచ్చాక.. లోపల అందే సేవలకు లక్షలాది రూపాయిలు చెల్లించేలా ధరలు ఉండేవంటున్నారు. విదేశీ యువతుల కోసం భారీగా చెల్లింపులు జరిపేవారని చెబుతున్నారు. విదేశీ యువతులతో డ్యాన్స్ చేస్తూ.. రెండు రోజులు బయటకు రాకుండా హోటల్ కే పరిమితం అయ్యేవారిని.. ఇందుకోసం కొందరు ఆ రెండు రోజులకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు చెల్లింపులు జరిపే వారంటే.. ఎంత హైప్రొఫైల్ పార్టీలన్నది ఇట్టే అర్థం కాక మానదు.
Tags:    

Similar News