ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేసిన హీరో - హీరోయిన్!

Update: 2021-03-18 14:00 GMT
అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కోలాహ‌లం మామూలుగా లేదు. అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌ధాన పార్టీలు తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. అయితే.. కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో బ‌లం, బ‌ల‌గం పెద్ద‌గాలేని బీజేపీ సినిమా స్టార్ల‌ను న‌మ్ముకుంటోంది. ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్న మ‌ల‌యాళ న‌టుడు సురేష్ గోపీ, న‌టి ఖుష్బూ గురువారం నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

కేర‌ళ‌లోని త్రిసూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలుస్తున్నారు సురేష్ గోపీ. నామినేష‌న్ దాఖ‌లు చేసిన త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ.. త‌న‌కు నాలుగు చోట్ల పోటీ చేసేందుకు బీజేపీ అవ‌కాశం ఇచ్చింద‌ని చెప్పారు. అయితే.. చివ‌ర‌కు మోడీ సూచించిన త్రిసూర్ నుంచి పోటీ చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, మ‌రోవైపు సీనియ‌ర్ న‌టి ఖుష్బూ కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేశారు. త‌మిళ‌నాడులోని థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఆమె గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె సుంద‌ర్ వ‌ల్లు వ‌రుకోట్టంలో భారీ రోడ్ షో నిర్వ‌హించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 4వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫ‌లితాలు మే2న వెలువ‌డ‌నున్నాయి.
Tags:    

Similar News