క్షమించండి నేను అలా మాట్లాడటం తప్పు : కుష్బు

Update: 2020-10-15 17:30 GMT
తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా నేత కుష్బు క్షమాపణలు తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కుష్బు ఈ నెల 14 చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా కుష్బు మాట్లాడుతూ మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్‌ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో వివాదాస్పదం అయ్యాయి. కుష్భు చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులోని ఓ హక్కుల సంస్థ 30 పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసింది.

అయితే ఈ వివాదంపై కుష్బు స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పదబంధాలను తప్పుగా వాడినందుకు క్షమించమని కోరడమే కాక ఇది మరలా జరగకుండా చూస్తానని అన్నారు. నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిని. అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్‌లో.. వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నాను అనడం అభ్యంతరకరమైనది’ అన్నారు. అంతేకాక ‘నా కుటుంబ సభ్యులు కొందరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాకు సమర్థులైన, తెలివైన, డైనమిక్‌, బైపోలార్‌ డిజార్డర్‌, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఇలా వేర్వేరు రకాల స్నేహితులు ఉన్నారు. వారి స్నేహం, జ్ఞానం నన్ను ధనవంతురాలిని చేసింది’ అన్నారు కుష్బు.
Tags:    

Similar News