బాబు చేతిలో పత్తిపాటికి క్లాస్ పడింది

Update: 2016-06-21 11:15 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో అసహనం పెరిగిపోతోంది. ఆయన అనుకున్నట్లుగా పనులు అనుకున్న రీతిలో జరగకపోవటమే కారణం. ఎంత ముందు నుంచి ఎన్ని మాటలుచెప్పినా.. ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసినా.. చివరకు వచ్చేసరికి అంతా హడావుడిగా మారటం దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇవి చాలవన్నట్లు ముద్రగడ దీక్ష లాంటివి ఉండనే ఉన్నాయి.

తాను కోరుకున్న విధంగా మంత్రులు.. అధికారులు పని చేయటం లేదని ఫీల్ అవుతున్న బాబు.. తాజాగా తనలోని అసహనాన్ని బయటపెట్టటమే కాదు.. అధికారుల్ని.. మంత్రి పత్తిపాటి పుల్లారావును క్లాస్ పీకటం గమనార్హం. ఉద్యోగుల బదిలీల పై వీడియోకాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన చంద్రబాబు.. జరుగుతున్న పనుల మీద అధికారులపైనా.. మంత్రిపత్తిపాటి పుల్లారావును విసుక్కోవటం కనిపించింది.

తాను చెప్పింది వినకుండా.. సిన్సియారిటీ లేకుండా పని చేస్తే ఎలా అంటూ మండిపడ్డ ఆయన.. గుంటూరు.. విజయవాడ మధ్య గంట కన్నా తక్కువే ప్రయాణ దూరం ఉన్నప్పటికీ పత్తిపాటి పట్టించుకోవటం లేదని బాబు విసుక్కున్నారు. ఈగోలు పెరిగిపోతున్నట్లుగా ఆయన మండిపడ్డారు. బాబు పీకిన క్లాస్ తో మంత్రి పత్తిపాటి మోము చిన్నబోయిన పరిస్థితి. అధికారుల అందరి ముందు మంత్రులను అలా చిన్నబుచ్చటం చంద్రబాబుకు మంచిది కాదన్న అభిప్రాయం పలువురు తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News