సీజన్ మారితే మళ్లీ 'మహా'లో అధికారం మనదే!

Update: 2019-11-27 05:54 GMT
మహారాష్ట్ర లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మార్పు చెందుతున్నాయి. మహారాష్ట్రలో సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలా సాగిన రాజకీయాలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి ఈ ఉత్కంఠత ఇలానే కొనసాగుతూ వచ్చింది. మొదట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యాబలం లేదు కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉంటాం అని చెప్పిన బీజేపీ ..ఆ తరువాత కేవలం రాత్రి కి రాత్రి ఎన్సీపీ కీలక నేత అజిత్ పవర్ తో మంతనాలు జరిపి .. ఏకంగా సీఎంగా ఫడ్నవిస్ చేత ప్రమాణస్వీకారం చేయించింది.

కానీ , ఆ తరువాత అంతే వేగంగా .. చక్రం తిప్పిన శివసేన , శరద్ పవార్ .. అజిత్ ని వెనక్కి రప్పించడంలో సఫలం కావడం తో రేపు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ సమయంలో మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్ భార్య ..మహా రాజకీయాల పై కీలక వ్యాఖ్యలు చేసింది. మంగళవారం రోజు తన భర్త ఫడ్నవీస్ ముఖ్యమంత్రి  పదవికి రాజీనామా చేశాక అమృత ఫడ్నవీస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమృత ఫడ్నవీస్ ఒక బ్యాంకు ఉద్యోగస్తురాలు. సీజన్ మారగానే మళ్లీ కొత్త విధానాలతో తిరిగి ప్రభుత్వంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేసారు. అలాగే ఐదేళ్ల పాటు అద్భుతమైన పరిపాలన అందించేందుకు దీవించిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తన భర్త పై తన కుటుంబం పై చూపిన ప్రేమ ఎప్పటికీ మరవలేమనే ఎమోషనల్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర అభివృద్ధి కి తన ఆలోచనలు కూడా జతచేసినట్లు చెప్పిన అమృతా ఫడ్నవీస్... ఉన్న ఐదేళ్లలో ప్రజాసేవకే తన భర్త అంకితమయ్యాడని , త్వరలోనే మళ్లీ కచ్చిత్తంగా అధికారంలోకి వస్తామని, ప్రజలకి మరోసారి అద్భుతమైన పాలనని అందిస్తామని చెప్పారు.

Tags:    

Similar News