కొడుకు పార్శిల్ ఓపెన్ చేసిన తండ్రికి షాక్

Update: 2020-08-30 03:30 GMT
నిండా 16 ఏళ్లు కూడా లేవు. 9వ తరగతి చదువుతున్న తన కొడుకు పార్శిల్ చూసిన తండ్రి షాక్ అయ్యాడు. కొడుకు బయటకు వెళ్లగా.. కొరియర్ ద్వారా తన కొడుకుకు వచ్చిన పార్శిల్ ను తీసుకొని తండ్రి ఓపెన్ చేశాడు.. అవాక్కయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

బెంగళూరులోని సదాశివనగర్ కు చెందిన ఓ 45 ఏళ్ల వ్యాపారవేత్తకు 9వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. పిల్లాడు ఆడుకోవడానికి బయటకు వెళ్లగా.. అతడికి ఓ కొరియర్ వచ్చింది. దాన్ని అతడి తండ్రి తీసుకొని తెరిచిచూశాడు. అందులో గోధుమ రంగులో పొడి కనిపించింది. అనుమానం వచ్చిన వ్యాపారవేత్త తన స్నేహితుడికి దాన్ని ఫొటో తీసి వాట్సాప్ చేశాడు. దాన్ని స్నేహితుడు గంజాయిగా గుర్తించాడు.

దీంతో వ్యాపారవేత్త వెంటనే పోలీసులను ఆశ్రయించి తన కుమారుడిపై ఎలాంటి చర్యలు లేకుండా ఆ పంపిన వాడిని పోలీసులతో కలిసి గుర్తించాడు. కొరియర్ ఆఫీస్ ద్వారా అది ఎంజీ రోడ్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ధీరజ్ కుమార్ అనే వ్యక్తి పంపాడని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు ఎంతమందికి ఇలా గంజాయి సరఫరా చేస్తున్నాడన్నది వివరాలు సేకరిస్తున్నాయి.
Tags:    

Similar News