కొత్త విషయం; ఫ్యామిలీతో జగన్ హ్యాంగౌట్

Update: 2015-08-15 10:11 GMT
ఎత్తులు.. పైఎత్తులన్నవి రాజకీయాల్లో మామూలే. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు చేయాల్సిన పనులెన్నో ఉంటాయి. అందులోకి ఒక రాష్ట్ర విపక్ష నేతగా ఉండటం అంత చిన్న విషయం కాదు. పార్టీలో ఉత్తేజాన్ని తీసుకురావటంతో పాటు.. అధికారానికి చేరువ కావటానికి పడాల్సిన శ్రమ ఎంతో.

నిత్యం క్షణం ఊపిరి సలపని పనుల్లో బిజీగా ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువ. ఫ్యామిలీకి తక్కువ.. రాజకీయాలు.. వ్యాపారాలకు ఎక్కువ సమయం కేటాయించే జగన్.. తాజాగా తన వైఖరికి భిన్నమైన విధంగా వ్యవహరించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో రీయూనియన్ అయ్యారు.

ఈ కార్యక్రమానికి జగన్.. ఆయన సతీమణి భారతి.. పిల్లలు హర్ష.. వర్ష.. జగన్ తల్లి విజయమ్మ.. సోదరి షర్మిల.. ఆమె భర్త  అనిత్ అంతా కలిసి హోటల్ లో డిన్నర్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఫ్యామిలీ పర్సన్ కాదన్న జగన్ తన మీదున్న ముద్రకు భిన్నంగా.. హోటల్ లో ఉల్లాసంగా గడిపినట్లు చెబుతున్నారు. వాస్తవానికి బయటకు చాలా అరుదుగా వెళ్లే విజయమ్మ కూడా ప్యామిలీ ఢిన్నర్ లో పాల్గొనటం విశేషంగా చెబుతున్నారు.

చాలాకాలం తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేశారని చెబుతున్నారు. ఇక.. హోటల్  కు వెళ్లిన జగన్.. తన సెక్యూరిటీ మొత్తాన్ని హోటల్ బయటే వదిలిపెట్టి.. చాలా పరిమితమైన సిబ్బందితో సాదాసీదాగా లోపలకు వెళ్లినట్లు చెబుతున్నారు. డిన్నర్ పూర్తయిన తర్వాత అందరి కంటే మొదట అనిల్ వెళ్లిపోయినట్లుగా జగన్ సన్నిహితులు చెబుతున్నారు. ఉల్లాసభరితమైన వాతావరణంలో జగన్ కుటుంబం మొత్తం ఒకచోట చేరి.. కొన్ని గంటలు గడపటం విశేషంగా చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News