టీడీపీ ఖాళీ ఖాయం.. కన్నా సంచలనం

Update: 2019-07-13 10:44 GMT
గుంటూరులో శనివారం  విలేకరులతో మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది ఉత్సాహంతో ఉన్నారని.. త్వరలోనే టీడీపీ ఖాళీ అయిపోతుందని స్పష్టం చేశారు. అయితే టీడీపీలోని 7 లేదా 8మందిని తప్ప మిగిలిన వారిని అందరినీ చేర్చుకుంటామంటూ సంచలన కామెంట్ చేశారు.

ఇక వైసీపీ నేతలు కూడా మాతో టచ్ లో ఉన్నారని మరో దుమారం రేపారు. ఇక బీజేపీలో చేరికకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాజాగా బీజేపీకి చంద్రబాబు అవసరం ఉందని వ్యాఖ్యానించడాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఖండించాడు.

మళ్లీ చంద్రబాబు బీజేపీతో సాన్నిహిత్యాన్ని నెరుపుతున్నాడన్న వందతులపై కన్నా కొట్టిపారేశారు. మాకే కాదు.. చంద్రబాబు అవసరం టీడీపీకి కూడా లేదంటూ సంచలన కామెంట్ చేశారు.

బీజేపీలోకి త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని.. పలువురు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు కూడా చేరుతారని కన్నా స్పష్టం చేశారు.

    

Tags:    

Similar News