అదును చూసి బాబును దెబ్బకొట్టిన కేశినేని

Update: 2019-12-11 10:48 GMT
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక చంద్రబాబు తీరుపై బహిరంగంగా గళమెత్తారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు తీరువల్లే ఓడామని.. ఆయన నిర్ణయాల వల్లే ఇలా జరిగిందని.. ఇప్పటికీ కొందరికి కొమ్ముకాస్తున్నాడని తనకు అన్యాయం చేస్తున్నాడని.. నాని  సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తించారు. మూడు నెలల పాటు తన అసమ్మతిని వినిపించిన కేశినేని నాని ఈ మధ్య సైలెంట్ అయ్యారు. రెండు నెలలుగా మౌనంగా ఉంటున్నారు. ఢిల్లీలో మిగతా ఇద్దరు టీడీపీ ఎంపీలతో కలిసి తిరుగుతున్నారు.

అయితే ఇప్పుడు అదును చూసి కేశినేని నాని కొట్టిన దెబ్బకు చంద్రబాబు అబ్బా అంటున్నాడట.. ఏపీలో దారుణ ఓటమి తర్వాత మోడీషాలతో చంద్రబాబు కాళ్లబేరం చేసుకున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఆ కోవలోనే తన నలుగురు ఎంపీలనూ బీజేపీలోకి పంపారని అంటున్నారు. ఇలా బీజేపీతో సాన్నిహిత్యం నెరుపుతున్న చంద్రబాబుకు తాజాగా గట్టి షాకిచ్చారు కేశినేని నాని.

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి వైసీపీ, టీడీపీ రెండు మద్దతు ఇచ్చాయి. అయితే తీరా ఓటింగ్ సమయానికి టీడీపీ నుంచి రెండు ఓట్లు మాత్రమే పడ్డాయి. ఎంపీ కేశినేని నాని సమయానికి తప్పివ్వడంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందట.. ఈ విషయంలో టీడీపీ మిగతా ఇద్దరు ఎంపీలు నాని గైర్హాజరుపై చంద్రబాబుకు వివరించారట.. సైలెంట్ గా ఉండి మారిపోయాడనుకున్న నాని ఇలా అదును చూసి చంద్రబాబును కొట్టారట..

 అసలే బీజేపీతో దోస్తీ కోసం ఉబలాటపడుతున్న  చంద్రబాబుకు ఇప్పుడు నాని ఇచ్చిన షాక్ తో గూబగుయ్యి మైందట.. మరి నిజంగా నాని పార్టీలో ఉంటారా పార్టీ మారుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News