కుష్బూ చెప్పిన అమ్మ సంగతులు!

Update: 2016-10-24 13:25 GMT
అనారోగ్యంతో దాదాపు నెలరోజులకు పైగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి - అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంగా తాజా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అన్నడీఎంకే పార్టీ నేతలు ఈ మేరకు అమ్మ కోలుకున్నారని, మరో 10 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు ఫిజియోథెరపీ ఇస్తున్న తీరును అధ్యయనం చేసిన డాక్టర్లు కూడా అమ్మ ఆరోగ్యంపై సంతృప్తిగా ఉన్నారట.

ఈ సందర్భంలో దీపావళిలోపు లేదా దీపావళి రోజున ఆసుపత్రి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి వెళ్లాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈలోగా లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్‌ తోపాటు ఎయిమ్స్ డాక్టర్లు కూడా ఆదివారం అపోలోకి వచ్చి ట్రీట్‌ మెంట్ జరుగుతున్న తీరుని పరిశీలించారని చెబుతున్నారు. అయితే మరో 10 రోజులు ఆమె ఆసుపత్రిలోనే వుంటే మంచిదని రిచర్డ్ సూచించారని, అయితే తమిళులకు దీపావళి సెంటిమెంట్ ఎక్కువ కావడంతో వచ్చే ఆదివారం జయ ఆసుపత్రి నుంచి ఇంటికి రావచ్చునని అన్నాడీఎంకె వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే సమయంలో తాజాగా నటి ఖుష్బూ - జయలలితను కలిశారు. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలితను చూసి వచ్చినట్లు ఖుష్బూ ట్వీట్‌ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి బావుందని, మరింత త్వరగా ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నటున్నామని, ఈ దీపావళిని అమ్మ తమిళనాడు ప్రజలతో జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు ఖుష్బూ ట్వీట్‌ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News