పేలని జగన్... ఆడేసుకుంటున్న లోకేష్..?

Update: 2022-04-05 11:11 GMT
పప్పు కాస్తా పవర్ ఫుల్ గా మారిపోతున్నారా. తన మీద జనాలు వేసిన పప్పు ట్యాగ్ ని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారా. చూడబోతే లోకేష్ బాబు అలాగే కనిపిస్తున్నారు. ఆయన తగ్గేదే లే అంటున్నారు. తనకు వైసీపీలో అసలు  ఎవరూ వద్దు, ముఖ్యమంత్రి జగన్ మాత్రమే తన‌ టార్గెట్ అంటున్నారు.

అంటే ఇక్కడ లెక్క చూడాలి. జగన్ సీఎం. ఆయన మీద విమర్శలు చేసేవారు కూడా ఆ లెవెల్ వారే ఉంటారుగా. అందుకే లోకేష్ తన అపొజిషన్ లో తన పొజిషన్ అలా చూసుకుంటున్నారు అన్న మాట. ఏ సబ్జెక్ట్ వచ్చినా జగన్ విషయంలో ట్వీట్ చేయనిదే లోకేష్ ఆగేట్లు లేరు.

ఇక లోకేష్ మీద ట్వీట్లు వరసబెట్టి వేయడానికి వైసీఎపీలో మరో సీనియర్ నేత ఉన్నారు. ఆయనే ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన చినబాబుని తనదైన శైలిలో హాట్ హాట్ కామెంట్స్ తో ఆటపట్టించినా చినబాబు చూపు మాత్రం అటు లేదు. ఆయన జగన్నే అంటారు, ఆయనని అంటేనే తన పొజిషన్ ఒక లెవెల్ లో ఉంటుందని భావిస్తున్నారు.

లేటెస్ట్ గా లోకేష్ బాబు జగన్ని పట్టుకుని పేలని గన్ అనేశారు. ఇది చాలా పెద్ద మాటే. కానీ అక్కడ అన్నది లోకేష్ బాబు. ఆయన వెనక ఉన్నది చంద్రబాబు. దాంతో ఆ పెద్ద మాటను వాడినా తట్టుకునే సీన్ అయితే ఫుల్ గా ఉంది.

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అంటూ ఏకంగా సోషల్ మీడియాలో పోల్ ఒకటి పెట్టేసారు లోకేష్ బాబు. జగన్ తన కేసుల గురించి మాట్లాడుకోవడానికి బాబాయ్ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ ని తప్పించేందుకు, అదే విధంగా కాగ్ గుర్తించిన నలభై ఎనిమిది వేల కోట్ల విషయం కామప్ చేయడానికి ఇలా చాలా ఆప్షన్లు ఇచ్చి మరీ పోల్ నిర్వహించారు లోకేష్.

అన్నీ కూడా జగన్ కి యాంటీగా ఉన్న ఆరోపణలే. అన్నీ నెగిటివ్ కామెంట్స్. ఇందులో ఏది జనాలు నొక్కినా జగన్ని బదనాం చేయవచ్చు. మొత్తం మీద చూస్తే లోకేష్ కొత్త రకం రూట్ ఎంచుకున్నారు. ఎటూ ఈ పోల్ లో ఓట్ చేసేది ఎక్కువగా టీడీపీ జనాలే కాబట్టి జగన్ ఢిల్లీ టూర్ పూర్తిగా ఆయన సొంత రాజకీయం కోసమే అని చెప్పడానికి కూడా పోల్ రిజల్ట్ ఉపయోగపడుతుంది. మరి జగన్ని పట్టుకుని ఒక్కలా ఆడేసుకోవడం లేదుగా చినబాబు.
Tags:    

Similar News