ఆత్మహత్యాయత్నం..చిరంజీవే కారణమని లేఖ

Update: 2017-06-10 08:26 GMT
తెలంగాణ సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేపుతోంది. దేవన్న అనే 38 ఏళ్ల వ్యక్తి శనివారం తన భార్యా పిల్లలతో కలిసి సెక్రటేరియట్ కు వచ్చిన తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని సెక్రటేరియట్ సిబ్బంది గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన ఆత్మహత్యాయత్నానికి కారణమేంటో వివరిస్తూ దేవన్న లేఖ కూడా రాశాడు. తన పరిస్థితికి రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.. నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివలింగయ్యలతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా కారణమని దేవన్న ఆరోపించాడు.

తాను చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని నమ్మి దాని కోసం పని చేసి దగా పడ్డానని దేవన్న అన్నాడు. తన పరిస్థితి ఏంటి.. దానికి వీళ్లంతా ఎలా బాధ్యులు అన్న వివరాలు దేవన్న పొందుపరచలేదు. దేవన్నకు భార్యతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇల్లు గడవలేని పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి దేవన్న సెక్రటేరియట్ కు వచ్చాడు. చిరంజీవిని కలిసి సాయం అడిగేందుకు ఆయన ఇంటి వద్ద పలుమార్లు ప్రయత్నించినా.. సెక్యూరిటీ సిబ్బంది తనను లోనికి పంపలేదని దేవన్న వివరించాడు. తన మరణానంతరం తన బిడ్డల బాగోగులు చూడాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దేవన్న విన్నవించడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News