అన్నం వండ‌లేద‌ని కాళ్లు.. చేతులు కోసేశాడు!

Update: 2019-07-22 06:49 GMT
బెజ‌వాడ‌లో దారుణం చోటు చేసుకుంది. బాధ్య‌త లేకుండా తాగుడుకు బానిసై.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే భ‌ర్త‌.. తాజాగా భార్య‌పై దాడి చేసిన వైనం ఒక ఎత్తు అయితే.. ఆమె త‌ప్పు లేకున్నా.. ఆమె కాళ్ల‌ను.. చేతుల్ని కోసేసిన వైనం షాకింగ్ గా మారింది.

విజ‌య‌వాడ టూటౌన్ పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం గొల్ల‌పాలెం గ‌ట్టు వ‌ద్ద నివసిస్తున్నారు అన్న‌పురెడ్డి జ‌గ‌దీష్ రెడ్డి.. హాస‌ని దంప‌తులు. దాదాపుగా ఏడేళ్ల క్రితం వారిద్ద‌రికి పెళ్లైంది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా. ఆటో డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్న జ‌గ‌దీష్ రెడ్డి తాగుడుకు బానిస‌య్యాడు. ఇంటికి వ‌స్తువులు తేకుండా భార్య‌ను వేధిస్తుంటాడు. వారిద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూగొడ‌వ‌లు చోటు చేసుకుంటుంటాయి.

తాజాగా అర్థ‌రాత్రి 12.30 గంట‌ల వేళ‌లో ఇంటికి వ‌చ్చిన జ‌గదీశ్‌.. అన్నం పెట్ట‌మ‌న్నాడు. ఇంట్లో బియ్యం లేని కార‌ణంగా వండ‌లేద‌ని చెప్పింది. దీంతో కోపానికి గురైన అత‌గాడు.. భార్య‌పై దాడికి పాల్ప‌డి.. చాకుతో కాళ్లు.. చేతులు కోశాడు. ఈ నేప‌థ్యంలో భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.


Tags:    

Similar News