23వ అంతస్తు నుంచి వివాహిత సూసైడ్..కారణం తెలిస్తే అయ్యో అనకుండా ఉండలేరు

Update: 2023-01-17 04:31 GMT
భార్య.. భర్త.. వారికో కొడుకు. డబ్బులకు కొదవ లేదు. ఆనందానికి హద్దుల్లేని రీతిలో జీవనం సాగించే వీలున్నా.. అదేమీ చేయని ఒక స్వార్థపూరిత వ్యక్తి తీరు.. తాజాగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఒక ఆత్మహత్య సంచలనంగా మారింది. ఈ సూసైడ్ కు కారణం ఇప్పుడు షాకింగ్ గా మారటమే కాదు.. ఆత్మహత్య చేసుకున్న మహిళ గురించి తెలిసిన వారంతా అయ్యో అనకుండా ఉండలేకపోతున్నారు.

హైదరాబాద్ లోని కేపీహెచ్ బీలో ఉన్న మంజీరా ట్రినిటీ బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్నారు శ్రీధర్.. స్వాతి దంపతులు.వీరికి ఒక కొడుకు పుట్టారు. అతను అంగవైకల్యంతో పుట్టాడు. అతడ్ని చూస్తూ తట్టుకోలేకపోయేవాడు శ్రీధర్. దీంతో.. తన కొడుకును మెర్సీ కిల్లింగ్ తో దూరం చేసుకోవాలన్నఆలోచనలో ఉండేవాడు.అయితే.. భర్త ఆలోచనలకు నో చెప్పేది భార్య స్వాతి.

కష్టమో.. నష్టమో బిడ్డ ఆలనాపాలనా తాను చూసుకుంటానని గట్టిగా వాదించేది.  కన్నకొడుకును చంపుకోలేనని స్పష్టం చేసేది. దీంతో.. దంపతుల మధ్య తరచూ ఏదో విధంగా గొడవలు జరిగేవి.

అయితే.. కొడుకు మెర్సీ కిల్లింగ్ విషయంలో భర్త పట్టుదలతో ఉండటం.. రోజులు గడిచే కొద్దీ పరిస్థితి ఇబ్బందికరంగా మారటంతో తీవ్రమైన మనోవ్యధకు గురైన స్వాతి.. తాజాగా తాను నివాసం ఉంటున్న భనంలోని 23వ అంతస్థు నుంచి కిందకు దూకేసి ప్రాణాల్ని తీసేసుకున్నారు.

ఈ సూసైడ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. భార్య డెడ్ బాడీని తీసుకునేందుకు భర్త శ్రీధర్ అందుబాటులోకి రావటం లేదన్న మాట వినిపిస్తోంది.

దీనిపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన తీరుతో భార్య ప్రాణాల్ని తీసిన శ్రీధర్ ను కఠినంగా శిక్షించాలంటూ స్వాతి కుటుంబ సభ్యులు.. బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరి.. శ్రీధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News