అమ్మ షర్మిల..నువ్వు వైఎస్ ఆర్ కూతురని మర్చిపోకు: ఎంపీ అరవింద్

Update: 2021-03-27 04:15 GMT
మాటల తూటాలు పేల్చడంలో.. చీల్చి చెండాడడంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ అందరికంటే ముందుంటాడు. తెలంగాణ మాండలికంలో ఆయన కేసీఆర్  - కేటీఆర్ - టీఆర్ఎస్ సర్కార్ ను తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతుంటాడు. అలాంటి అరవింద్ పై వైఎస్ షర్మిల కామెంట్ చేస్తే ఊరుకుంటాడా? తాజాగా రెచ్చిపోయాడు.

తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సమాలోచనలు చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పసుపుబోర్డు కోసం బాండ్ రాసిచ్చి మరీ మాట తప్పిన ఎంపీ అరవింద్ పై విమర్శలు గుప్పించారు. ఆడిన మాట తప్పుతారా? అని నిలదీశారు.

పసుపుబోర్డు విషయంలో తనపై కామెంట్ చేసిన వైఎస్ షర్మిలకు బీజేపీ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ‘మన తెలంగాణ కోడలు.. బ్రదర్ అనిల్ గారి భార్య సిస్టర్ షర్మిల నన్ను ఎక్కడో గుర్తు చేసుకున్నారట.. సంతోషం.. కానీ విషయాలు మాట్లాడే ముందు అవగాహన చేసుకుంటే మంచిది’ అని అరవింద్ కౌంటర్ ఇచ్చాడు.

‘మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అనే విషయాన్ని మర్చిపోవద్దు.. మీ తండ్రి భాగస్వామిగా ఉన్న యూపీఏ, యూపీఏ2 సర్కార్ హయాంలో ఉన్న పరిస్థితి అందరికీ తెలుసు. అప్పటికంటే ఇప్పుడు పసుపునకు అత్యధిక ధర కల్పించామని’ అరవింద్ చెప్పుకొచ్చారు. మీ అన్న గారు సీఎంగా ఉన్న ఏపీలో ప్రకటించిన బోనస్ కంటే .. ఇక్కడ అత్యధిక ధర ఇస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. 
Tags:    

Similar News