నందమూరి కుటుంబంలో విషాదం.. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె హఠాన్మరణం

Update: 2022-08-01 09:59 GMT
నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం పొందారు. సోమవారం ఆమె అనారోగ్యంతో మరణించినట్లుగా తెలుస్తోంది.

ఈ విషాద వార్తను తెలుసుకున్నంతనే నారా లోకేశ్ బంజారాహిల్స్ లోని వారి ఇంటికి వెళ్లారు. స్వర్గీయ నందమూరి తారకరామారావుకు మొత్తం పదకొండు మంది పిల్లలు కాగా.. వారిలో ఏడుగురు కుమారులు.. నలుగురు కుమార్తెలు.

ఏడుగురు కుమారుల్లో జయకృష్ణ.. సాయికృష్ణ.. హరికృష్ణ.. మోహనకృష్ణ.. బాలకృష్ణ.. రామకృష్ణ.. జయశంకర్ కృష్ణలు కొడుకులు కాగా.. కుమార్తెలు లోకేశ్వరి.. దగ్గుబాటి పురంధేశ్వరి.. నారా భువనేశ్వరి.. కంటమనేని ఉమామహేశ్వరి. అమ్మాయిల్లో ఆఖరి అమ్మాయి అయిన ఉమామహేశ్వరి అకాల మరణం.. నందమూరి కుటుంబానికి షాకింగ్ గా మారింది.

కాసేపట్లో ఉమామహేశ్వరి నివాసానికి నారా చంద్రబాబు నాయుడు చేరుకుంటారని చెబుతున్నారు. ఆమె మరణ వార్తను.. విదేశాల్లోని నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.

ఆమె మరణానికి కారణం ఏమిటన్న పూర్తి వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. గడిచిన కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో చికిత్స చేయించుకుంటున్న ఆమె.. ఈ రోజు ఉదయం హఠాన్మరణం పొందినట్లుగా చెబుతున్నారు. దీంతో.. నందమూరి అభిమానుల్లో విషాదం నెలకొంది.
Tags:    

Similar News