సీఎం తర్వాత పవార్, దేశ్ ముఖ్ లకు మాఫియా బెదిరింపులు

Update: 2020-09-07 17:31 GMT
దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వరుసగా రెండోరోజు బెదిరింపు కాల్స్ చేసింది. నిన్న ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఇంటిని పేల్చేస్తామని బెదిరింపు కాల్స్ చేసిన దావూద్ గ్యాంగ్ ఈరోజు మరింత రెచ్చిపోయింది.

తాజాగా శివసేన ప్రభుత్వం భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ , మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ లకు సోమవారం బెదిరింపు కాల్స్ వచ్చాయి. దేశం బయటి నుంచే ఈ కాల్స్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వీటిపై దర్యాప్తు చేస్తున్నారు.

దుబాయ్ నుంచి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తరుఫున తాను కాల్ చేస్తున్నాని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పినట్టు అధికారులు తెలిపారు. రాత్రి 10.30 గంటలకు ఆగంతకుడు రెండు సార్లు ఫోన్ చేసి బెదిరించినట్టు సమాచారం.

దీంతో సీఎం నివాసానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఇప్పుడు పవార్, దేశ్ ముఖ్ లకు భద్రతను పెంచారు.
Tags:    

Similar News