ఆరుగురు అమ్మాయిలు.. అందరూ సూసైడ్ చేసుకున్నారు

Update: 2022-04-10 05:04 GMT
షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. విన్నంతనే విస్మయానికి గురి చేసే ఈ దారుణ ఉదంతంలో ఆరుగురు అమ్మాయిలు విషం తాగిన వైనం సంచలనంగా మారింది. ఎందుకిలా? జరిగింది? ఆరుగురు అమ్మాయిలు విషం తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి. అసలేం జరిగిందంటే.. బిహార్ లోని ఔరంగాబాద్ లోని కాస్మా ప్రాంతానికి చెందిన ఆరుగురు బాలికలు ఒకేచోట ఉండేవారు. ఈ ఆరుగురికి మధ్య స్నేహం తప్పించి ఎలాంటి బంధురికం లేదు. ఇదిలా ఉంటే.. ఈ ఆరుగురిలో ఒక బాలిక ఒక అబ్బాయితో ప్రేమలో పడినట్లుగా తెలుస్తోంది.

తన ప్రేమ విషయాన్ని ఆ అబ్బాయిని.. తమలోని ఒకరి చేత లవ్ ప్రపోజల్ పంపారు. అందుకు ఆ కుర్రాడు సైతం ఓకే చెప్పటంతో లవ్ ట్రాక్ మొదలైనట్లు చెబుతారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే తేడా కొట్టేసింది. ప్రేమలో ఉన్న అమ్మాయి.. తనను పెళ్లాడాలని యువకుడ్ని కోరినట్లు తెలుస్తోంది.

అందుకు ఆ కుర్రాడు నో చెప్పటంతో ఆ అమ్మాయి తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా చెబుతున్నారు. ఆ బాధను తట్టుకోలేని ఆ బాలిక విషం తాగింది. ఆ తర్వాత ఏమైందన్నది మిస్టరీగా మారింది. ఎందుకంటే.. స్నేహితురాలు విషం తాగిన వైనాన్ని గుర్తించిన వెంటనే.. ఆమెతో ఉన్న ఐదుగురు బాలికలు విషం తాగేసిన అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో ముగ్గురు బాలికలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడవగా.. మిగిలిన ముగ్గురు బాలికలు మగధ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ వాదన మరోలా ఉంది. బాలిక ప్రేమను కుర్రాడు ఒప్పుకోలేదని.. దీంతో ఆరుగురు బాలికలు గ్రామ సమీపంలోని కొలను వద్దకు వచ్చి మాట్లాడుకున్నారని తెలిపారు. అనంతరం యువకుడ్ని ప్రేమిస్తున్న బాలిక మొదట విషం తాగగా.. దాన్ని చూసిన మిగిలిన స్నేహితురాళ్లు విషం తాగినట్లుగా చెబుతున్నారు.

భావోద్వేగంతో ఆరుగురు స్నేహితురాళ్లు విషం తాగినట్లుగా భావిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఆరుగురు ఎందుకు విషం తాగారన్న మిస్టరీ.. చికిత్స పొందుతున్న బాలికలకు స్వస్థత చేకూరాక తెలుస్తుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News