ఎన్టీఆర్ ట్ర‌స్ట్ తో చేతులు క‌లిపిన చిరు బ్ల‌డ్‌ బ్యాంక్‌

Update: 2017-01-17 11:37 GMT
ఇద్ద‌రు హీరోల మ‌ధ్య పోటీ ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌క్తిగ‌తంగా వారి మ‌ధ్య‌న స‌హృద్భావ వాతావ‌ర‌ణం ఉంటుంది. దీనికి నిద‌ర్శ‌నంగా ఇరువురు అగ్ర‌హీరోలు త‌మ చిత్రాల విడుద‌ల‌ను పుర‌స్క‌రించుకొని మాట్లాడుతూ.. త‌మ సినిమాతో పాటు.. సంక్రాంతికి విడుద‌ల‌య్యే అన్ని సినిమాలు విజ‌య‌వంతం కావాల‌నికోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. కానీ.. అందుకు భిన్నంగా అభిమానుల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఏ విధంగా సాగిందో సోష‌ల్ మీడియాను చూసిన ప్ర‌తిఒక్క‌రికి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకొని బుధ‌వారం (జ‌న‌వ‌రి 18న‌) నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ బోర్డు స‌భ్యురాలు నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సాగ‌నుంది. సేవాస్ఫూర్తితో నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని రెండు రాష్ట్రాల్లోని 145 చోట్ల నిర్వ‌హించ‌నున్నారు.

ఈ భారీ ర‌క్త‌దాన కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ ట్ర‌స్ట్ బోర్డుతో పాటు రెడ్ క్రాస్‌.. రోట‌రీ.. ల‌య‌న్స్ క్ల‌బ్బులు.. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌.. ఆరోహి.. ఇత‌ర బ్ల‌డ్ బ్యాంక్ లు పాల్గొన‌నున్నాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ‌లో భువ‌నేశ్వ‌రి.. బ్ర‌హ్మ‌ణి ప్రారంభిస్తే.. ఏపీలో నారా లోకేశ్ ప్రారంభించ‌నున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News