పోలవరం పనులు ఆపేందుకు వెనుక ఉన్నది ఎవరంటే?

Update: 2019-11-01 08:49 GMT
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్ల గుండెల్లో వణుకు పుట్టించాడు. గత ప్రభుత్వాలు ఎక్కువ మొత్తానికి టెండర్లని తమకి నచ్చిన వారికీ అప్పగించాయి అని వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రానికే తలమానికమైన పోలవరం పై రివర్స్ టెండరింగ్ కి వెళ్ళింది. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారుగా 628  కోట్ల రూపాయల సొమ్ము ఆదా  అయ్యింది.

ఈ రివర్స్ టెండరింగ్ లో పోలవరం ప్రాజెక్ట్ ని  మేఘా ఇంజనీరింగ్ సంస్థ 4358 కోట్లకి దక్కించుకుంది. దీనితో నవయుగ సంస్థ దీనిపై హై కోర్ట్ కి వెళ్లి పనులని ప్రారంభించకుండా స్టే విధించేలా చేసింది. కానీ - తాజాగా దీనిపై సమగ్ర విచారణ జరిపిన హై కోర్ట్ ఆ స్టే ని ఎత్తివేస్తూ పనులని ప్రారభించుకోవచ్చు అని తెలిపింది. దీనితో పోలవరం పనులకి నేడు భూమి పూజ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రేపటి నుండే ( నవంబర్ 2) పనులని కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
 
కోర్ట్ స్టే ఎత్తేయడంతో  నేడు సబ్ కాంట్రాక్టర్లు అవసరమైయ్యే  వాహనాలతో పోలవరం దగ్గర భూమి పూజ చేయడానికి బయల్దేరారు. కానీ, పోలవరం వద్దకి యంత్ర సామాగ్రి తో బయల్దేరిన సబ్ కాంట్రాక్టర్లని -  గతంలో పోలవరంలో పనిచేసిన సబ్ కాంట్రాక్టర్లు ..లోకల్ లీడర్స్ తో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీనితో వెంటనే రంగంలోకి దిన పోలీసులు ఆందోళనకారులని పక్కకు నెట్టి మెగా అధికారులను - యంత్రాలతో కూడిన వాహనాలను ముందుకు పంపారు. అలాగే మధ్యలో మరోసారి ఆందోళనకారులు అడ్డుతగిలే  ఆస్కారం ఉండటంతో  పోలవరం వరకు అధికారులకి - యంత్ర వాహనాలకు రక్షణగా వెళ్లారు. మరికాసేపట్లోనే  మెగా ఇంజనీరింగ్ అధికారులు భూమిపూజ చేసి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించబోతున్నారు. పోలవరం పనులని ఆపడానికి ఎదో ఒక  బలమైన రాజకీయ పార్టీ ట్రై చేస్తుందని  పలువురు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలని తెలియపరుస్తున్నారు.  

Tags:    

Similar News