పెండింగ్​ చలాన్లు వెంటనే కట్టేయండి..! లేదంటే పోలీసులే ఇంటికొస్తారు..!

Update: 2020-12-11 00:30 GMT
ఏళ్ల తరబడి ట్రాఫిక్​ చలాన్లు పెండింగ్​లో ఉండటంతో వాటిని వసూలు చేసుకొనేందుకు ముంబై పోలీసులు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. నేరుగా పెండింగ్​ ఉన్నవాళ్ల ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేయనున్నారు. ముంబైలో ట్రాఫిక్​ చలాన్లు భారీగా పేరుకుపోయాయి. దాదాపు రూ. 317 కోట్లు బకాయిలు ఉన్నట్టు సమాచారం. దీంతో పెండింగ్​ బకాయిలు ఎలాగైనా వసూలు చేయాలని పోలీసులు చూస్తున్నారు. అయితే ట్రాఫిక్​ పోలీసులు హోంశాఖ అనుమతి కోసం లేఖ రాశారు.

మొత్తం 11 బృందాలు చలాన్ల వసూలుకు వెళ్లనున్నాయి. ముంబైలో నాలుగేళ్ల క్రితం నుంచి ఈ చలాన్లు విధిస్తున్నారు.కానీ వాహనదారులు మాత్రం డబ్బులు చెల్లిండం చేదు దీంతో ముంబై ట్రాఫిక్​ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడ్డారు. వాళ్లు చలాన్లు చెల్లించని వాళ్ల ఇంటికి వెళతారు. వాళ్లతో మాట్లాడి డబ్బులు వసూలు చేసుకుంటారు. వాళ్లు డబ్బులు కడితే వెంటనే రశీదు కూడా ఇస్తారు.

అయితే ఈ లోపే వాహనదారులు చలాన్లు చెల్లిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. కనీసం ఈ చర్యలతోనైనా బకాయిల పెండింగ్​ తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే పోలీసులకు ఇళ్లకు వెళ్లేందుకు ఇంకా హోంశాఖ అనుమతి రాలేదని.. హోంశాఖ అనుమతి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.
Tags:    

Similar News