ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ పాదయాత్ర మొదలైంది. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఐదు విడతల పాదయాత్రలు పూర్తి చేశాడు. ఇంకో యాత్రను మొదలుపెడుతున్నారు. ఇక వైఎస్ షర్మిల అయితే ఇప్పటికే పాదయాత్ర మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేశారు.3500 కి.మీలు తిరిగేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర అంటేనే పవర్ ఫుల్ యాత్ర. పాదయాత్రతో అధికారం సాధ్యమవుతుందన్న నమ్మకం ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్రనే ఏకైక ఆయుధం అని అందరూ భావిస్తున్నారు.
గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు , వైఎజ్ జగన్ లు అధికారంలోకి వచ్చారు. ఇక వీరిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో బండి సంజయ్, షర్మిలలు.. ఏపీలో నారాలోకేష్ పాదయాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయబోతున్నారు.
ఇక వీరి బాటలోనే తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ లో అసమ్మతి తగ్గించడం.. నేతలు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తేవడం.. వచ్చే ఎన్నికల్లో గెలిపించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ , టూరుపై కసరత్తు చేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఆరు ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి చివరి వారంలో రేవంత్ 'సకల జనుల సంఘర్షణ యాత్ర' పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. 5 నెలల పాటు పాదయాత్ర జరుగనుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ఈ పాదయాత్రకు ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టారు. ఇదే ఊపులో తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేలు కూడా పాదయాత్రకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
తెలంగాణలో రేవంత్ కు పోటీగా భట్టి కూడా పాదయాత్ర చేయాలని యోచిస్తున్నారు. సీఎల్పీ నేత హోదాలో భట్టి కూడా పాదయాత్ర బాధ్యతలు చూసుకోవాలని.. రేవంత్ తో కలిసి చేయాలని కొందరు అంటుంటే.. భట్టి పాదయాత్ర చేస్తే ఇతర బాధ్యతలను చూసుకోవచ్చని మరికొందరు అంటున్నారు.
గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు , వైఎజ్ జగన్ లు అధికారంలోకి వచ్చారు. ఇక వీరిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో బండి సంజయ్, షర్మిలలు.. ఏపీలో నారాలోకేష్ పాదయాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయబోతున్నారు.
ఇక వీరి బాటలోనే తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ లో అసమ్మతి తగ్గించడం.. నేతలు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తేవడం.. వచ్చే ఎన్నికల్లో గెలిపించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ , టూరుపై కసరత్తు చేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఆరు ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి చివరి వారంలో రేవంత్ 'సకల జనుల సంఘర్షణ యాత్ర' పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. 5 నెలల పాటు పాదయాత్ర జరుగనుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ఈ పాదయాత్రకు ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టారు. ఇదే ఊపులో తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేలు కూడా పాదయాత్రకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
తెలంగాణలో రేవంత్ కు పోటీగా భట్టి కూడా పాదయాత్ర చేయాలని యోచిస్తున్నారు. సీఎల్పీ నేత హోదాలో భట్టి కూడా పాదయాత్ర బాధ్యతలు చూసుకోవాలని.. రేవంత్ తో కలిసి చేయాలని కొందరు అంటుంటే.. భట్టి పాదయాత్ర చేస్తే ఇతర బాధ్యతలను చూసుకోవచ్చని మరికొందరు అంటున్నారు.