పరీక్షలో పాస్ కండి..రూ.151 కోట్ల స‍్కాలర్‌ షిప్‌ అందుకోండి !

Update: 2021-08-06 10:58 GMT
ఆన్‌ లైన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ అప్‌ గ్రేడ్‌ కు చెందిన కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ అప్‌ గ్రేడ్‌జీత్‌… రూ.151 కోట్ల కామన్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (ఎన్‌ ఆర్‌ ఏ) సీఈటీ ఉపకార వేతనాలకు అర్హత పరీక్షలను నిర్వహించనుంది. ఆగస్టు 8న జాతీయ స్థాయిలో జరగనున్న ఈ పరీక్ష రాసేందుకు ఇప్పటికే 2.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షలు గత జులై నెలలో 18, 25 తేదీలలో రెండు సార్లు జీత్‌ సీఈటీ టెస్ట్‌ కు అపూర్వ స్పందన లభించిందని..అప్పుడు 2.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు.

ఈ టెస్ట్ రాసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతుండటంతో మరొక టెస్ట్‌ ను నిర్వహించనున్నామని అప్‌ గ్రేడ్‌ జీత్‌ సీఈఓ రితేష్‌ రౌషన్‌ తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండు రౌండ్లుగా పరీక్ష ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కాగ్‌, సెంట్రల్‌ సెక్రటరియేట్‌ సర‍్వీస్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌, రైల్వే,విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర శాఖల్లో ఉద్యోగుల భర్తీకి కేంద్రం నేషనల్‌ రిక్రూట్‌ మెంట్‌ ఏజెన్సీ కామన్‌ ఎలిజిబులిటి టెస్ట్‌ టెస్ట్‌ ను నిర్వహిస్తుంది. ఎందులో ఉత్తీర్ణత సాధించిన వారు కేంద్ర ప్రభుత్వ కొలువులకు ఎంపికవుతారు. ఇక ఈ టెస్టుకు ప్రిపేర్ అయ్యే వారికి అప్‌ గ్రేడ్‌ జీత్‌ సంస్థ కోచింగ్ ఇస్తుంది.

పరీక్ష సిలబస్ కు తగినట్లు కోచింగ్ ఇచ్చి విద్యార్థులను ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా ఈ సంస్థలో కోచింగ్ తీసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఆర్ధిక చేయూతను కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్కాలర్ షిప్ టెస్టులు నిర్వహిస్తుంది. 'జీత్‌ సీఈటీ టెస్ట్‌' ను నిర్వహించి భారీ మొత్తంలో స్కాలర్‌ షిప్‌ ను అందించేందుకు సిద్ధమైంది. స్కాలర్ షిప్ కు సంబందించిన మూడవ టెస్ట్ ఆగస్టు 8న నిర్వహించనున్నారు. పరీక్షరాసే అభ్యర్థులను రెండు రౌండ్లుగా విభజిస్తారు. ప్రిలిమినరీ రౌండ్ లో ఉత్తీర్ణత సాధించిన వారిని మెయిన్స్ కి ఆహ్వానిస్తారు. మెయిన్స్  లో 3000 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ మూడు వేలమందికి 6 నెలలపాటు NRA CET కోర్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ ని ఉచితంగా అందిస్తారు. దీంతోపాటు రూ.151 కోట్ల స్కాలర్ షిప్ ను అందిస్తారు. ఇక ప్రిలిమ్స్ మాత్రమే క్వాలి ఫై అయిన వారికి ఒక నెలపాటు NRA CET కోర్స్‌ సబ్‌ స్క్రిప్షన్‌ అందిస్తారు.
Tags:    

Similar News