సానియాకు రాజీవ్ ఖేల్ ర‌త్న‌

Update: 2015-08-14 16:24 GMT
భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్ రత్న అవార్డుకు ప్రముఖ భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఎంపికయ్యారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా, అవార్డుల ఎంపిక కమిటీ కొద్ది రోజుల క్రితం సానియా పేరును ఖరారు చేస్తూ కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుతో పాటు 17 మందికి అర్జున అవార్డులను కూడా కేంద్రం ప్రకటించింది.

అర్జున అవార్డు వరించిన వారిలో యువ క్రికెటర్ రోహిత్ శర్మ, కిదాంబి శ్రీకాంత్ లు ఉన్నారు. వీరితో పాటు షూటర్ జీతూ రాయ్ , జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, హాకీ ఆటగాడు శ్రీజేష్, రెజ్లింగ్ క్రీడలో బజ్ రంగ్, బబిత, అథ్లె‌ట్ పూవమ్మ, షట్లర్ శ్రీకాంత్, బాక్సర్ మన్‌ దీప్ జంగ్రా తదితరులున్నారు.
Tags:    

Similar News