టీచర్ పై విద్యార్థి అత్యాచారయత్నం

Update: 2019-09-14 05:02 GMT
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ విద్యార్థి తనకు విద్యాబుద్దులు నేర్పే టీచర్ పై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆ టీచర్ తీవ్రంగా ప్రతిఘటించి ఆమె మానం కాపాడుకుంది.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురైయూర్ యూనియన్ కోంబై గ్రామ పరిధిలోని మరుదై కొండ అనే అటవీ గ్రామం ఉంది. ఇక్కడి గిరిజన, ఆదివాసీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసింది. దీనికి 26 ఏళ్ల యువ ఉపాధ్యాయురాలును నియమించింది. అయితే గ్రామం చుట్టూ అడవి ఉండడం.. రెండు కిలోమీటర్లు అడవీలో ప్రయాణించి టీచర్ విద్యార్థులకు చదువు చెప్పేందుకు వచ్చేది.

ఈ క్రమంలోనే తాజాగా పాఠశాలలో చదువుచెప్పి ఇంటికి వెళ్లడానికి రెడీ అయ్యింది. రెండు కిలోమీటర్లు అడవి గుండా నడుస్తుండగా టీచర్ పై కన్నేసిన విద్యార్థి బాలుడు ఆమె వెంట వెళ్లి అడవి మధ్యలో టీచర్ పై అత్యాచార యత్నానికి తీవ్రంగా ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన టీచర్ బాలుడి చెర నుంచి తప్పించుకొని గ్రామానికి వచ్చి గ్రామస్థులకు విషయం తెలిపింది.

దీంతో గ్రామస్థులంతా బాలుడిపై తురైయూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామానికి వచ్చిన పోలీసులు బాలుడు, టీచర్ కు సర్ధిచెప్పి పంపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి కొండ గ్రామ ప్రజలు బాలుడిని అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. లేకపోతే విద్యార్థులకు, మహిళలకు భద్రత లేదని పోలీసులను డిమాండ్ చేశారు.
Tags:    

Similar News