అల్లాను సంతృప్తి పరిచేందుకు బిడ్డను చంపేశాడు

Update: 2018-06-10 17:04 GMT
ఒళ్లు గ‌గుర్పొడిచే ఘ‌టన ఇది. భ‌క్తి కాస్త మూర్ఖ‌త్వానికి దారి తీసిన ఉదంతం. పవిత్ర రంజాన్ మాసంలో అల్లాను సంతృప్తి పరచడం కోసం ఓ తండ్రి తన నాలుగేళ్ల బిడ్డను చంపేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌ లోని జోధ్‌ పూర్‌ లో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నవాబ్ అలీ ఖురేషి అనే ఓ వ్య‌క్తి ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. ఖురేషీ కుటుంబం తన ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తుంది. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న నాలుగేళ్ల పాపను గ్రౌండ్ ఫ్లోర్‌ కు తీసుకువచ్చి పదునైన కత్తితో ఆ చిన్నారి గొంతు కోశాడు ఖురేషి. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు టెర్రస్ పైకెళ్లి మిగతా కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. అయితే, తెల్లవారుజామున తన పాప కనిపించకపోయేసరికి తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది.

ఆందోళ‌న‌తో ఇంటి కింద‌కు ప‌రుగెత్తుకొని రాగా గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని చూసి తల్లి తల్లడిల్లింది. తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తానికి పోలీసుల విచారణలో నవాబ్ అలీ ఖురేషి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. రంజాన్ మాసంలో అల్లాను సంతృప్తి పరచడం కోసమే బిడ్డను హత్య చేశానని ఖురేషి పేర్కొన్నాడు. రంజాన్ మ ఆసంలో అల్లా ఆశీస్సులా పొందేందుకే ఇలా చేశాన‌ని ప్ర‌క‌టించాడు.
Tags:    

Similar News