టీడీపీ యువనాయకులు వైసీపీకి జంప్?

Update: 2022-08-01 15:30 GMT
2024 ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ...ఆ ఎన్నికల కోసం ఇప్పటికే ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ టీడీపీ నుంచి కరణం బలరాం వంటి చాలామంది సీనియర్ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ హవా కొనసాగే అవకాశాలెక్కువగా ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి మరింత మంది నేతలు చేరే చాన్స్ ఉందని టాక్.

ముఖ్యంగా, టీడీపీ సీనియర్ నేతల కుమారులు వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారట.

టీజీ వెంకటేష్ కుమారుడు భరత్, సిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వంటి యువ నేతలు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారట.

వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందని వీరంతా భావిస్తున్నారట. ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా...వైసీపీ అవలీలగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేస్తుందన్న నమ్మకంతో వారు ఉన్నారట.

అంతేకాదు, వీరంతా వైసీపీ నేతలతో టచ్ లు ఉన్నారట. సరైన సమయం చూసి పార్టీలో చేరేందుకు వారు సిద్ధమని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారట. వీరు ముగ్గురే కాకుండా ఇంకా చాలామంది టీడీపీ యువ నేతలు వైసీపీవైపు పక్క చూపులు చూస్తున్నారట.

అయితే, ఆల్రెడీ టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలు చాలామంది ఉన్నారని, కొత్తగా వచ్చే వారికి టికెట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత వారిని పార్టీలోకి ఆహ్వానించాలని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారట. ఏది ఏమైనా..ఆ ముగ్గురు టీడీపీ యువనాయకులు వైసీపీలోకి జంప్ అవుతారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News