నిజమైన కరోనా మరణాల రేటు బయటపడే అవకాశమే లేదు ..ఎందుకంటే ?
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఎంతమంది మరణించారు. నిజమైన కరోనా మరణాల రేటు ఎంత సంఖ్య ఉంటుందో ఇక ఎప్పటికీ తేలకపోవచ్చు.. ఇప్పుడు కరోనా మరణాలు, కేసుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే అధిక మొత్తంలోనే కరోనా మరణాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. కరోనా మరణాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ దాటేశాయి. కచ్చితమైన కరోనా వైరస్ మరణాల రేటును తేల్చేందుకు సైంటిస్టులు నిరంతరం కుస్తీలు పడుతూనే ఉన్నారు. మరణాల రేటు, వైరస్ సోకినవారి శాతం, ఎంత మంది వ్యాధితో మరణిస్తారు అనేదానిపై స్పష్టత లేదు.
కరోనా సోకిన వారిలో 0.5శాతం నుంచి 1శాతం మందిని బలితీసుకుంటోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్య వయస్సుతో చాలా తేడా ఉందని అంటున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి పెరిగిన టెస్టులు, మెరుగైన చికిత్సలు, మరణాల తగ్గుదల కనిపించింది. కానీ, కచ్చితమైన సంఖ్యను గుర్తించడం కష్టంగా మారుతోంది. రణాల రేటు, వ్యాధి సోకిన వారిలో ఎంతమంది ఇంకా మృతిచెందే పరిస్థితులు ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. కరోనా మరణ రేటును కచ్చితంగా నిర్ణయించలేక పోవడానికి ఎదురయ్యే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం…
సాధారణంగా వాస్తవ మరణాల రేటును మొత్తం అంటువ్యాధుల సంఖ్యతో మరణాలను పోల్చి లెక్కిస్తారు. వ్యాధి సోకిన చాలామందిలో అసలు లక్షణాలు ఉన్నట్టే తేలడం లేదు. అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోంది. లక్షణాలు ఉంటే వారికి వైరస్ సోకినట్టు నిర్ధారించొచ్చు.. కానీ, లక్షణ రహిత కరోనా కేసులే ఎక్కువగా ఉండటంతో గుర్తించడం కష్టమవుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ల మందికి కరోనా సోకింది. కరోనా వ్యాధి సోకిన వారిలో 0.5శాతం నుంచి 1శాతం మందిని బలితీసుకుందని నిపుణులు భావిస్తున్నారు. యువకులు, పిల్లలు తీవ్రమైన వ్యాధిని ఎదుర్కొనే అవకాశం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. అది వాస్తవమే అయినప్పటికీ పరిశోధకులు వయస్సు ప్రకారం కూడా ప్రమాద స్థాయిని లెక్కించడం మొదలుపెట్టారు. 20 ఏళ్లలోపువారి మరణాల రేటు 10,000 మందిలో ఒకటి 85 ఏళ్లు పైబడిన వారు ఆరుగురిలో ఒకరు ఉన్నారని సిఎటెల్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ డాక్టర్ మురై అన్నారు.
కరోనావైరస్ టెస్టు ద్వారా నిర్ధారించే కొత్త అంటువ్యాధుల సంఖ్యతో పోల్చినప్పుడు మరణాల రేటు స్పష్టంగా తగ్గిందని తేలింది. కరోనా సోకిన వారిలో తేలికపాటి అనారోగ్యం లేదా లక్షణాలు లేని ఎక్కువ మందిని గుర్తించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి చికిత్స చేయడంలో అత్యధిక ప్రమాదకర గ్రూపులను రక్షించడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో వైరస్ ఇన్ఫెక్షన్లు సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. టెస్టుల పెరుగుదల, మెరుగైన వైద్య సంరక్షణ కావొచ్చు.. యువతలోనే ఎక్కువగా వ్యాధి వ్యాప్తి చెందింది.
కరోనా సోకిన వారిలో 0.5శాతం నుంచి 1శాతం మందిని బలితీసుకుంటోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్య వయస్సుతో చాలా తేడా ఉందని అంటున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి పెరిగిన టెస్టులు, మెరుగైన చికిత్సలు, మరణాల తగ్గుదల కనిపించింది. కానీ, కచ్చితమైన సంఖ్యను గుర్తించడం కష్టంగా మారుతోంది. రణాల రేటు, వ్యాధి సోకిన వారిలో ఎంతమంది ఇంకా మృతిచెందే పరిస్థితులు ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. కరోనా మరణ రేటును కచ్చితంగా నిర్ణయించలేక పోవడానికి ఎదురయ్యే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం…
సాధారణంగా వాస్తవ మరణాల రేటును మొత్తం అంటువ్యాధుల సంఖ్యతో మరణాలను పోల్చి లెక్కిస్తారు. వ్యాధి సోకిన చాలామందిలో అసలు లక్షణాలు ఉన్నట్టే తేలడం లేదు. అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోంది. లక్షణాలు ఉంటే వారికి వైరస్ సోకినట్టు నిర్ధారించొచ్చు.. కానీ, లక్షణ రహిత కరోనా కేసులే ఎక్కువగా ఉండటంతో గుర్తించడం కష్టమవుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ల మందికి కరోనా సోకింది. కరోనా వ్యాధి సోకిన వారిలో 0.5శాతం నుంచి 1శాతం మందిని బలితీసుకుందని నిపుణులు భావిస్తున్నారు. యువకులు, పిల్లలు తీవ్రమైన వ్యాధిని ఎదుర్కొనే అవకాశం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. అది వాస్తవమే అయినప్పటికీ పరిశోధకులు వయస్సు ప్రకారం కూడా ప్రమాద స్థాయిని లెక్కించడం మొదలుపెట్టారు. 20 ఏళ్లలోపువారి మరణాల రేటు 10,000 మందిలో ఒకటి 85 ఏళ్లు పైబడిన వారు ఆరుగురిలో ఒకరు ఉన్నారని సిఎటెల్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ డాక్టర్ మురై అన్నారు.
కరోనావైరస్ టెస్టు ద్వారా నిర్ధారించే కొత్త అంటువ్యాధుల సంఖ్యతో పోల్చినప్పుడు మరణాల రేటు స్పష్టంగా తగ్గిందని తేలింది. కరోనా సోకిన వారిలో తేలికపాటి అనారోగ్యం లేదా లక్షణాలు లేని ఎక్కువ మందిని గుర్తించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి చికిత్స చేయడంలో అత్యధిక ప్రమాదకర గ్రూపులను రక్షించడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో వైరస్ ఇన్ఫెక్షన్లు సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. టెస్టుల పెరుగుదల, మెరుగైన వైద్య సంరక్షణ కావొచ్చు.. యువతలోనే ఎక్కువగా వ్యాధి వ్యాప్తి చెందింది.