బ్రేకింగ్ : జూన్లోనే రెమ్డిసివిర్ ... 10 లక్షల డోసులతో సిద్ధం !
ఈ మహమ్మారి చికిత్స కి ఉపయోగిస్తున్న డ్రగ్ రెమ్డిసివిర్ సరఫరాకు సంబంధించి 10 లక్షల డోసులను అందించేందుకు రెడీగా ఉన్నామని ఫార్మా దిగ్గజం హెటిరో ల్యాబ్స్ ఎండీ బి.వంశీకృష్ణ తెలిపారు. తొలి దశలో భాగంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే 10లక్షల డోసులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ డ్రగ్ తయారు చేసి, విక్రయించేందుకు అమెరికన్ సంస్థ గిలీడ్ సైన్సెస్ తో హెటిరో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
మన దేశంలో ఈ మెడిసిన్ కి ఏమేర డిమాండ్ ఉంటుంది అనేది అంచనా వేయలేము అని , ప్రభుత్వం చెప్పే దాన్ని బట్టే తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. డిమాండ్ ఎలా ఉండబోతున్నప్పటికీ తమ వంతుగా ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు 10 లక్షల డోసులు అందించేందుకు సిద్ధమవుతున్నామని వంశీకృష్ణ చెప్పారు. లైసెన్సీలతో మాట్లాడిన అనంతరం రెండు, మూడు వారాల్లో ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికైతే దీన్ని అందుబాటులోకి తేవడంపైనే దృష్టి సారిస్తున్నామన్నారు. దేశీయంగా ఈ ఔషధం వినియోగం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా తెలియడం లేదు కాబట్టి ఆదాయ అవకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని తెలిపారు.
డీసీజీఐకి తదుపరి రెండు వారాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నట్టు వంశీకృష్ణ చెప్పారు. అత్యవసరమైన అంశం డీసీజీఐ కూడా అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయొచ్చని ఆశిస్తున్నాం. 7–10 పనిదినాల్లో అందుబాటులోకి తేస్తామన్నారు. జూన్ లోనే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ధర విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని వంశీకృష్ణ తెలిపారు. సాధారణంగా ధరను నిర్ణయించుకునేందుకు తయారీ సంస్థలకు అధికారం ఉందని, అయితే ప్రస్తుతం ప్రభుత్వపరమైన కొనుగోళ్ల కారణంగా దీనిపై ప్రభుత్వంతో కూడా చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. బహుశా రెండు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.
తాము ఉత్పత్తి చేసే ఈ ఔషధం పూర్తిగా మేకిన్ ఇండియా నినాదానికి అనుగుణంగా ఉంటుందని అయన తెలిపారు. రెమ్డిసివిర్ ను విశాఖ, హైదరాబాద్ ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నామని, ఇండియా ప్రొడక్టుగా చెప్పవచ్చునని అన్నారు. ఆఫ్రికా, ఆసియా మొదలైన ఖండాల్లో మధ్య, తక్కువ స్థాయి ఆదాయాలుండే సుమారు 127 దేశాలకు రెమ్డిసివిర్ ను ఎగుమతి చేయొచ్చని వంశీకృష్ణ చెప్పారు
మన దేశంలో ఈ మెడిసిన్ కి ఏమేర డిమాండ్ ఉంటుంది అనేది అంచనా వేయలేము అని , ప్రభుత్వం చెప్పే దాన్ని బట్టే తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. డిమాండ్ ఎలా ఉండబోతున్నప్పటికీ తమ వంతుగా ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు 10 లక్షల డోసులు అందించేందుకు సిద్ధమవుతున్నామని వంశీకృష్ణ చెప్పారు. లైసెన్సీలతో మాట్లాడిన అనంతరం రెండు, మూడు వారాల్లో ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికైతే దీన్ని అందుబాటులోకి తేవడంపైనే దృష్టి సారిస్తున్నామన్నారు. దేశీయంగా ఈ ఔషధం వినియోగం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా తెలియడం లేదు కాబట్టి ఆదాయ అవకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని తెలిపారు.
డీసీజీఐకి తదుపరి రెండు వారాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నట్టు వంశీకృష్ణ చెప్పారు. అత్యవసరమైన అంశం డీసీజీఐ కూడా అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయొచ్చని ఆశిస్తున్నాం. 7–10 పనిదినాల్లో అందుబాటులోకి తేస్తామన్నారు. జూన్ లోనే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ధర విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని వంశీకృష్ణ తెలిపారు. సాధారణంగా ధరను నిర్ణయించుకునేందుకు తయారీ సంస్థలకు అధికారం ఉందని, అయితే ప్రస్తుతం ప్రభుత్వపరమైన కొనుగోళ్ల కారణంగా దీనిపై ప్రభుత్వంతో కూడా చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. బహుశా రెండు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.
తాము ఉత్పత్తి చేసే ఈ ఔషధం పూర్తిగా మేకిన్ ఇండియా నినాదానికి అనుగుణంగా ఉంటుందని అయన తెలిపారు. రెమ్డిసివిర్ ను విశాఖ, హైదరాబాద్ ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నామని, ఇండియా ప్రొడక్టుగా చెప్పవచ్చునని అన్నారు. ఆఫ్రికా, ఆసియా మొదలైన ఖండాల్లో మధ్య, తక్కువ స్థాయి ఆదాయాలుండే సుమారు 127 దేశాలకు రెమ్డిసివిర్ ను ఎగుమతి చేయొచ్చని వంశీకృష్ణ చెప్పారు