ఝార్ఖండ్‌లో ఘోరం : యువతిపై 60 మంది అత్యాచారం!

Update: 2021-03-06 10:41 GMT
ఝార్ఖండ్‌ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని బంధించిన దుండగులు నెలరోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బహిర్భూమి కోసం వెళ్తున్నట్టు చెప్పిన ఆమె వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని బయటపడడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌ కు చేరుకుని ఫిర్యాదు చేసింది. మత్తు మందు ఇచ్చి గత కొన్ని రోజులుగా 60 మంది తనపై లైంగిక దాడి చేస్తున్నారని ఎంత ఏడ్చినా కూడా వదిలి పెట్టలేదని, ప్రతిఘటిస్తే తీవ్రంగా కొట్టే వారంటూ ఆమె పోలీసులకు తెలియజేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తుంది. ఆ యువతి ఆరోగ్యం అస్సలు సరిగా లేదు. కనీసం ఆమె మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. ఆమె ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆమె చెప్పిన విషయాల ఆదారంగా ఎంక్వౌరీ చేస్తున్నారు. ఎప్పటి నుండి వారు కిడ్నాప్ చేసి అఘాయిత్యం చేస్తున్న విషయంను ఆమె చెప్పలేక పోవడంతో కేసు విషయమై ఎటూ తేల్చుకోలే పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. ఆమె ఆరోగ్యం కుదుట పడి అన్ని విషయాలు చెప్పే వరకు పోలీసులు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.మరోవైపు యువతి శరీరంపై సూది ఇచ్చిన గుర్తులు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా పరిగణించి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి SDPO సంజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. యువతి మానసిక ఆరోగ్యం సరిగా లేదని చెప్పారు. వైద్య పరీక్షల తర్వాత యువతని మరోసారి ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ కేసుల దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Tags:    

Similar News