బాబ్రీ విధ్వంసానికీ ఆ ముగ్గురే కారణం

Update: 2019-11-04 08:04 GMT
రాజకీయాలలో వివాదాలు అనేవి సర్వసాధారణం. అసలు రాజకీయం అంటేనే విమర్శలు , ప్రతి విమర్శలు. కొంతమంది నేతలు మాత్రమే తమ రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాలకి స్వస్తి పలుకుతారు. కానీ , అలాంటివారు కోటికొకరు ఉండటం కూడా కష్టమే. ఇప్పటి రోజుల్లో అలాంటివారు ఉంటారు అనుకోవడం కూడా కొంచెం అత్యాశ అవుతుంది. ఇకపోతే తాజాగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్‌ గోడ్బెలే ఒక పుస్తకం విడుదల చేసారు. బాబ్రీ మసీద్‌-రామ్‌మందిర్‌ డైలమా: యాసిడ్‌ టెస్ట్‌ ఫర్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌ అనే ఈ పుస్తకంలో పీవీ నరసింహారావుపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

అయోధ్యపై తీర్పు వెలువడనున్న ఇటువంటి కీలకమైన సమయాల్లో అయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలకి కొంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రాజీవ్‌గాంధీ, పీవీ సింగ్‌, పీవీ నరసింహారావు... అయోధ్య వివాదం పరిష్కారం కాకపోవడానికి, బాబ్రీ మసీదు విధ్వంసానికీ ఈ ముగ్గురే కారణం అని చెప్పారు. ప్రధానిగా ఒక దృఢమైన రాజకీయ నిర్ణయం తీసుకుని ఉంటే... రామాయణంలో ఈ మహాభారతం జరిగేదే కాదు అని మాట్లాడారు.

కీలకమైన టెస్ట్‌మ్యాచ్‌లో పీవీ ప్రధానమైన పాత్ర పోషించారు. దురదృష్టవశాత్తూ ఆయన నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌గా మిగిలిపోయారు అని విమర్శించారు. అంతకుముందు... బాబ్రీ మసీదుకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ రాజీవ్‌గాంధీ, వీపీ సింగ్‌ తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని మాధవ్‌ గోడ్బెలే ఆరోపించారు.  
కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించి, బాబ్రీ మసీదు కట్టడంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకుని, పూర్తి భద్రత కల్పించాలని ప్రణాళిక వేశారు. దీని అమలుకు వీలుగా ఆర్టికల్‌ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని కూడా సూచించారు. కానీ... రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చిన అధికారాలపై పీవీ మరో విధంగా ఆలోచించారు. సుప్రీంకోర్టుకు, జాతీయ సమగ్రత మండలికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనే విశ్వసించారు అని మాధవ్‌ గోడ్బెలే తెలిపారు.

దీంతో అప్పటి కల్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వానికి ‘స్వేచ్ఛ’ ఇచ్చినట్లయిందన్నారు. కరసేవకులను యూపీ సర్కారు అనుమతించడం, వారు శాంతి భద్రతలను తమ అదుపులోకి తీసుకోవడం, వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడం జరిగిపోయాయి. రాజ్యాంగబద్ధ విధులను నిర్వర్తించడంలో రాష్ట్ర సర్కారు వైఫల్యమే దీనికి కారణం అన్నారు. పరిస్థితి తీవ్రతను గ్రహించి కేంద్రానికి తెలపడంలో అప్పటి గవర్నర్‌ బి.సత్యనారాయణరెడ్డి విఫలమయ్యారని, పైగా రాష్ట్రపతి పాలన అవసరం లేదని చెప్పారని తెలిపారు. మాధవ్‌ గోడ్బెలే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడే 1993 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
Tags:    

Similar News