పవన్ పర్యటనలో అపశృతి.. ఇద్దరు మృతి

Update: 2018-06-06 06:43 GMT
విశాఖలో దారుణం జరిగింది. పవన్ పర్యటనలో అపశృతి దొర్లింది.. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యాత్రను పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఫ్లెక్సీలు కడుతుండగా ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతంతో మృతిచెందారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం పాయకరావుపేటలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం అర్థరాత్రి దాటాక పాయకరావుపేట ప్రధాన రహదారి పక్కన భవనంపైకి ఎక్కి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 33కేవీ విద్యుత్ తీగలకు ఫ్లెక్సీ ఇనుప రాడ్ లు తగిలి టి. నాగరాజు (28) - భీమవరపు శివ(31) అక్కడికక్కడే మృతిచెందారు..

శివ పాయకరావుపేట వాసి కాగా.. నాగరాజు స్వస్థలం తుని.. ఈ ఇద్దరు పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు.. ఈ ఘటనపై ఎస్ ఐ ఎల్ రామకృష్ణ  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.. కాగా అభిమానుల మృతి వార్త తెలిసి పవన్ కళ్యాణ్ తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలిసింది.. వారి కుటుంబాలను ఆదుకుంటానని పవన్ హామీ ఇచ్చినట్లు జనసేన నాయకులు తెలిపారు.
Tags:    

Similar News