కేర‌ళ న‌ర‌బ‌లి: భ‌ర్త ఎదుటే భార్య‌తో మాంత్రికుడి రొమాన్స్‌!

Update: 2022-10-14 04:17 GMT
కేర‌ళ‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను న‌ర‌బ‌లి ఇచ్చిన కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల విచార‌ణ‌లో రోజుకో కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది. ఆర్థిక ఇబ్బందులు తొల‌గ‌డానికి, అధిక సంపాద‌న‌కు మూఢ విశ్వాసాల‌తో దంప‌తులు, ఒక మాంత్రికుడితో క‌లిసి ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను ఖండ‌ఖండాలుగా న‌రికి బ‌లి ఇచ్చిన సంగ‌త‌వి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో దంప‌తుల‌తోపాటు మాంత్రికుడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. విచార‌ణ‌లో నిందితులు పోలీసులు అనేక సంచ‌లన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

కేరళలోని పథనంతిట్ట జిల్లా ఎలంతూర్‌లో భ‌గ‌వ‌ల్ సింగ్, లైలా దంప‌తులు ఉన్నారు. న‌ర‌బ‌లి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొల‌గి సంప‌ద చేకూరుతుంద‌ని వారికి మాంత్రికుడు ర‌షీద్ అలియాస్ మ‌హ్మ‌ద్ ష‌పీ చెప్పాడు.

అంతేకాకుండా త‌న‌కు ప‌రిచ‌య‌మున్న‌ వీధుల్లో లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే పద్మ (52)ను, రోస్లిన్‌(50)ను రషీద్‌ ఎలంతూర్‌లో భగవల్‌ సింగ్‌ దంపతుల నివాసానికి తీసుకువచ్చాడు. ఈ మ‌హిళ‌లిద్ద‌రూ ర‌షీద్‌కు ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ ద్వారా ప‌రిచ‌య‌మ‌య్యారు. గ‌తంలో 75 మ‌హిళ‌పై అత్యాచారం చేసి ర‌షీద్ జైలుకెళ్లాడు. ప్ర‌స్తుతం ఆ కేసులో బెయిల్ పై ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న శృంగార వాంఛ‌ను తీర్చుకోవ‌డానికి తనతో శృంగారంలో పాల్గొంటే రూ.15 వేలు ఇస్తానని, నీలి చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తానని ప‌ద్మ‌, రోస్లిన్‌ల‌ను బుట్టలో వేసుకున్నాడు.

వీరిని ఎలంతూరులోని భ‌గ‌వ‌ల్ సింగ్ నివాసానికి తీసుకొచ్చిన రషీద్ దంప‌తుల‌తో క‌లిసి వారిని న‌ర‌బ‌లి ఇచ్చాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌హిళ‌ల రొమ్ముల‌ను సైతం క‌త్తిరించాడు. ర‌క్తం ప్ర‌వ‌హిస్తే మంచి జ‌రుగుతుంద‌ని ఇలా రొమ్ములు కోశాడు. ఆ త‌ర్వాత ప‌ద్మ‌ను ఐదు ముక్కలుగా, రోస్లిన్‌ను 56 ముక్కలుగా చేశాడు. ఆ త‌ర్వాత భ‌గ‌వ‌ల్ సింగ్, అత‌డి భార్య‌, మాంత్రికుడు ర‌షీద్ మృతుల శ‌రీర భాగాల‌ను వండుకుని భుజించారు.

ఈ క్ర‌మంలో మాంత్రికుడు ర‌షీద్.. భ‌గ‌వ‌ల్ సింగ్ భార్య‌తో అత‌డి ముందే శృంగారం చేశాడ‌ని షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. భ‌ర్త అనుమ‌తితోనే ర‌షీద్ ఇలా చేశాడ‌ని వెల్ల‌డ‌య్యింది.

కాగా మరికొంత మందిని కూడా నరబలి ఇవ్వాల‌ని నిందితులు నిర్ణ‌యించుకున్న‌ట్టు తేలింది. న‌ర‌బలి కోసం ఇప్ప‌టికే తిరువళ్లకు చెందిన ఓ మహిళను షఫీ తీసుకొచ్చాడు. అయితే ఆమె తాను ఎక్కడుందన్న వివరాల్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో ఆమెను చంపితే దొరికిపోవడం ఖాయమని భయపడిన నిందితులు.. నరబలి ఆలోచనను వ‌దిలిపెట్టారు. అలానే ఓ చిన్నారితో కూడిన కుటుంబాన్ని కూడా నరబలి కోసం ష‌ఫీ.. భగవల్‌, లైలా ఇంటికి తీసుకొచ్చాడ‌ని స‌మాచారం.

ఈ క్ర‌మంలో ర‌షీద్.. చివ‌ర‌కు భ‌గ‌వ‌ల్ సింగ్ ను కూడా బ‌లికి సిద్ధం చేశాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. భగవల్‌ సింగ్‌ను హతమార్చ‌డం ద్వారా అత‌డి భార్య‌తో లైలాతో కలిసి జీవించేందుకు ర‌షీద్ కుట్ర ప‌న్ని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నరబలి కేసులో వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఓ హత్య కేసు సహా పలు కేసుల్లో ఇది వరకే షఫీ నిందితుడిగా ఉన్నాడు. ఓ మహిళను తీవ్రంగా గాయపరిచాడన్న కేసులో గతేడాది బెయిల్‌పై విడుదలయ్యాడు. చదివింది ఆరో తరగతే అయినా అత‌డు నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను కూడా నిర్వహిస్తుండడం గమనార్హం. శ్రీదేవి అనే మారు పేరుతో షఫీ ఓ ఫేస్‌బుక్‌ ఖాతాను నిర్వహిస్తున్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఆ ఖాతాతోనే భగవల్‌సింగ్‌ను బుట్టలో వేసుకున్నాడు. అలా 2018 నుంచి వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.

ఈ కేసులో ముగ్గురు నిందితులకీ రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీకి కోర్టు అనుమతించడంతో పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. నరబలి వెనుక ఆర్థికంగా లాభ‌ప‌డ‌ట‌మే కాకుండా మరేదైనా ఉద్దేశం ఉందా? ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News