చైనాలో నాసిరకం వ్యాక్సిన్లు.. కరోనాను నియంత్రించ లేక అవస్థలు!

Update: 2022-05-10 02:30 GMT
చైనాలో మరోసారి కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా మొదటి దశ కంటే రెండింతలు ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. రోజు రోజుకూ కరోనా పుట్టినిల్లు చైనా లో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. చైనా తూర్పు ప్రాంతం లోని షాంఘై మహా నగరం సహా చుట్టు ప్రక్కల ఉన్న మరో 70కి పైగా చిన్న నగరాలు, పట్టమాల్లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. గత రెండు నెలలుగా నిత్యం 10 వేల నుంచి 12 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తూ... ప్రజలను తెగ ఇబ్బంది పెడుతోంది.

అయితే చైనాలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ విధించడంతో పాటు ప్రజలకు బలవంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ లాక్ డౌన్ ఏ స్థాయిలో ఉందంటే ప్రజలను ఇళ్లలోనే బంధించి.. కనీసం ఆహారం కూడా సరఫరా చేయలేని స్థితిలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే చైనాలో కరోనా విపరీతంగా పెరిగి పోవడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫార్మా సంస్థ లు తయారు చేసిన వ్యాక్సిన్లు అంతగా ప్రభావం చూపలేదు. నాసిరకం వ్యాక్సిన్లు తయారు చేసిన ఫార్మా సంస్థలు.. వాటి పని తీరు, ప్రభావంపై పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించకుండానే ప్రజలకు పంపిణీ చేసింది.

చైనాకు చెందిన సినోఫార్మ్, సినోవాక్ నరియు క్యాన్సినో బయోలాజిక్స్ వంటి సంస్థలు కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. తమ వ్యాక్సిన్ల పనితనాన్ని గొప్పగా చెప్పుకున్న చైనా ప్రభుత్వం... ఆ మేరకు 2021 నుంచి విదేశాలకు సైతం ఆయా వ్యాక్సిన్లను ఎగుమతి చేసింది.

అయితే చైనా ఫార్మా సంస్థలు చేసిన వ్యాక్సిన్ లు అమెరికా ఫార్మా సంస్థలైన ఫైజర్-బయోఎన్ టెక్, మోడర్నా మరియు జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ల తో పోల్చితే తక్కువ ప్రభావం చూపాయి. దీంతో విదేశాల్లోనూ చైనా వ్యాక్సిన్లకు గిరాకీ తగ్గిపోయింది. చైనా సంస్తలు తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్ పై ఏమాత్రం ప్రభావం చూపలేదని స్వయంగా చైనా పరిశోధకులు తేల్చి చెప్పారు. ఈ క్రమం లోనే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి చైనాలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

అయితే మొదటి సారి కరోనా వచ్చినప్పుడు కూడా చైనా ప్రభుత్వం ప్రపంచానికి ఈ మహమ్మారి గురించి తెలియకుండా గోప్యంగా ఉంచింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా చైనాలో పరిస్థితులు మరింత దిగజారడం గురించి ఎవరికీ తెలియ కూడదని జాగ్రత్త పడుతోంది. కానీ అది ఆ దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ముప్పు గా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News