భూత వైద్యం పేరుతో మహిళలను లొంగదీసుకుంటున్న బాబా..తుక్కు రేగ్గొట్టిన మహిళలు

Update: 2020-10-13 23:30 GMT
భూతవైద్యం పేరిట యువతులు, బాలికలపై లైంగికదాడికి పాల్పడుతున్న ఓ బాబాను మహిళలు చితక్కొట్టారు. శాంతిపూజలు చేస్తా, ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తానంటూ ఈ దొంగ బాబా చాలా మంది యువతులను లోబర్చుకున్నాడు. తాజాగా ఓ 15 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడటంతో ఆమె తల్లిదండ్రులు తిరగబడ్డారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఈ ఘటన వెలుగుచూసింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. నిజామాబాద్​కు చెందిన ఓ వ్యక్తి బాబా అవతారమెత్తాడు. అనంతరం అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానంటూ చెప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలికలు, యువతులను లోబర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఓ దంపతులు తమ 15 ఏళ్ల కుమార్తెకు ఆరోగ్యం బాగా ఉండట్లేదని అతడి వద్దకు తీసుకొచ్చారు.

బాలికను పరిశీలించిన దొంగ బాబా కొన్నాళ్లు ఆమెను తనవద్దే ఉంచాలని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు బాలికను బాబాకు అప్పజెప్పారు. అప్పటినుంచి బాలికను బెదిరింపులకు గురిచేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆరా తీయడంతో దొంగ బాబా వ్యవహారం గురించి చెప్పింది. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు, బంధువులు బాబా ఉంటున్న ఆశ్రమానికి వెళ్లి ఆ దొంగ బాబాను రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి మరీ చితకబాదారు.
Tags:    

Similar News