బ్యూటీ పార్లర్ కు వచ్చిన ముగ్గురు మహిళలు చేసింది తెలిస్తే షాకే

ఒంగోలులోని కర్నూలు రోడ్డులో మహాలక్ష్మి కల్యాణమండపం సమీపంలో రజియా అనే మహిళ బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నారు

Update: 2023-09-06 08:42 GMT

బ్యూటీపార్లర్ కు వచ్చిన ముగ్గురు మహిళలు చేసిన నిర్వాకం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఒంగోలు పట్టణంలో చోటు చేసుకున్న ఈ క్రైం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇలా కూడా చేస్తారా? అన్న షాక్ కు గురి కాక మానరు. పట్టపగలు బ్యూటీపార్లర్ కు వచ్చి ఇలా దోచేయటమా? అంటూ షాక్ కు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే..

ఒంగోలులోని కర్నూలు రోడ్డులో మహాలక్ష్మి కల్యాణమండపం సమీపంలో రజియా అనే మహిళ బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో ముగ్గురు మహిళలు బ్యూటీపార్లర్ కు వచ్చారు. తమలో ఒకరికి ఫేషియల్ చేయాలని.. మరో మహిళ ఐ బ్రోస్ చేయాలని కోరారు. అందుకు సరేనంటూ వారికి సేవలు అందించే పనిలో ఉన్నారు రజియా. మూడో మహిళ వాష్ రూంకు వెళ్లి.. బయటకు వచ్చినంతనే తన చేతిలో ఉన్న బాటిల్ లోని ద్రవాన్ని రజియా మీద చిమ్మారు.

హటాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో పక్కకు వంగిన ఆమె కుడి భుజం.. ముక్కు మీద ద్రావణం పడింది. ఆ వెంటనే మిగిలిన ఇద్దరు మహిళలు రజియా ముఖం మీద క్లోరోఫాంతో ఉన్న కర్చీఫ్ను పెట్టటంతో ఆమె స్ప్రహ కోల్పోయారు. ఆమె ఒంటి మీద ఉన్న ఇరవై సవర్ల బంగారంతో పాటు.. క్యాష్ కౌంటర్ లో ఉన్న రూ.40వేల క్యాష్ తీసుకొని పరారయ్యారు. అనుమానాస్పద రీతిలో బయటకువచ్చిన మహిళల తీరుతో అనుమానం వచ్చిన పక్క వారు.. బ్యూటీపార్లర్ లో రజియా స్ప్రహ కోల్పోయిన వైనాన్ని గుర్తించి.. ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఆమె క్షేమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ క్రైం గురించి తెలిసినంతనే స్పందించిన పోలీసులు సీసీ కెమేరాల్ని పరిశీలించగా.. ముగ్గురు మహిళల వెళుతున్న ఫుటేజ్ ను గుర్తించారు. రజియా నుంచి దోచుకున్న బంగారం విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక దళాల్ని రంగంలోకి దించారు.

Tags:    

Similar News