ఆమెను డైరెక్టర్ గర్భవతిని చేశాడు: పూనమ్ కౌర్

అయితే ట్వీట్ లో ఎవరి పేరును కూడా ఆమె ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు పూనమ్ కౌర్ పోస్ట్.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Update: 2024-10-09 07:34 GMT

నటి పూనమ్ కౌర్.. గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉన్నా.. ఎప్పటికప్పుడు నెట్టింట ట్వీట్స్ చేస్తూ.. వైరల్ అవుతుంటారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై వరుస ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సినిమాల్లో నటించకపోయినా.. వివాదాస్పద ట్వీట్స్‌, కామెంట్స్‌ తో ట్రెండింగ్ లో నిలుస్తుంటారు. తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టారు.

ఓ ద‌ర్శ‌కుడు ఒక అమ్మాయికి అవకాశాలు ఇస్తాన‌ని మోసం చేసి గర్భవతిని చేశాడంటూ పూనమ్ కౌర్ ఆరోపించారు. అతని వల్ల ఆ పంజాబీ నటి కెరీర్ నాశనం అయిందని ట్వీట్ చేశారు. "MAA జోక్యంతో ఆమెకు కాస్త సహాయం దొరికింది. అతడు పొలిటీషియన్ గా మారిన నటుడు కాదు. అత‌డు ద‌ర్శ‌కుడు. ఆ విషయంలో నాతో పాటు మరో నటుడిని రాజకీయాల్లోకి అనవసరంగా లాగారు" అంటూ పూనమ్ రాసుకొచ్చారు.

అయితే ట్వీట్ లో ఎవరి పేరును కూడా ఆమె ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు పూనమ్ కౌర్ పోస్ట్.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ పంజాబీ అమ్మాయి ఎవరు.. ఆమెను గర్భవతిని చేసిందెవరో చెప్పమని ఆమెను అనేక మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా.. MAA కోసం ట్వీట్ లో పూనమ్ ప్రస్తావించడంతో.. టాలీవుడ్ కు చెందిన వ్యక్తినే ఆమె టార్గెట్ చేసినట్లుందని కొందరు నెటిజన్లు అనుమానపడుతున్నారు.

కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పై తాను మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని పూనమ్ ట్వీట్ చేశారు. కానీ తనతోపాటు చాలామందికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవచ్చని, అందుకే తన ఫిర్యాదును తిరస్కరించారని ఆరోపించారు. ఆ తర్వాత నిర్మాత చిట్టిబాబు ఆమె వ్యాఖ్యలపై స్పందించారు. ధైర్యం ఉంటే వచ్చి ఫిర్యాదు చేయాలని అన్నారు. దీంతో త్రివిక్రమ్ ను ప్రశ్నించే దమ్ము లేదు కానీ, ఏం తెలియకుండా మాట్లాడతారని పూనమ్ మండిపడ్డారు. ఇప్పుడు మరో డైరెక్టర్ గురించి ఆమె పోస్ట్ పెట్టారు.

అయితే పంజాబ్ కు చెందిన పూనమ్ కౌర్... మాయాజాలం మూవీతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆ తర్వాత విచిత్రం, శౌర్యం, నిక్కీ అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం , నెక్ట్స్ ఏంటీ, గగనం వంటి పలు సినిమాల్లో నటించారు. అనంతరం అవకాశాలు దక్కించుకోలేకపోయారు. దీంతో కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్నారు. కొంత గ్యాప్ తర్వాత 2022లో వచ్చిన నాతిచరామితో ప్రేక్షకులను పలకరించారు. కానీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు.

Tags:    

Similar News